సీఎం జ‌గ‌న్ పాల‌న‌కు 150 మార్కులేసిన జేసీ..!

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని మా ఫ్రెండ్ కుమారుడు అని ఎప్ప‌టికప్పుడు చెబుతూ ఉంటారు సీనియ‌ర్ నేత జేసీ దివాక‌ర్ రెడ్డి. అదే చొర‌వ‌తో అవ‌స‌రాన్నిబ‌ట్టీ పొగుడుతూ ఉంటారు, ఆ చొర‌వ‌తో విమ‌ర్శ‌లూ చేస్తుంటారు. కానీ, ఇప్పుడు ముఖ్య‌మంత్రి తీరుపై తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. మీడియాతో దివాక‌ర్ రెడ్డి మాట్లాడుతూ… ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో ఆంధ్రాలో ప‌రిపాల‌న చాలా జ‌న‌రంజ‌కంగా జ‌రుగుతోంద‌న్నారు! ఈ మాట మాట్లాడుతున్న‌ప్పుడు వెట‌కార‌పు బాడీ లాంగ్వేజే ఉంది! జ‌గ‌న్ పాల‌న‌కు ఎన్ని మార్కులు వేస్తార‌ని గ‌తంలో త‌న‌ని అడిగార‌నీ, దానికి ఇప్పుడు స‌మాధానం చెబుతాన‌నీ, 150 మార్కులు వేస్తున్నా అన్నారు జేసీ. అవి నూటికి తాను ఇస్తున్న మార్కుల‌ని చెప్పారు!

ఎప్పుడూ లేని విధంగా బ‌స్సులు సీజ్ చేస్తున్నార‌న్నారు జేసీ. మ‌రో మూడు నెల‌లు బ‌స్సులు తిప్ప‌కూడ‌ద‌ని అంటున్నార‌న్నారు. త‌న‌కు ర‌వాణా రంగంలో 70 సంవ‌త్స‌రాల అనుభ‌వం ఉంద‌నీ, ఎప్పుడైనా ఏదైనా జ‌రిగితే జ‌రిమానా లాంటిదేదో ఉంటుంద‌నీ, స‌స్పెన్ష‌న్స్ లాంటివి లేవ‌న్నారు. డ్రైవ‌ర్ కి బ్యాడ్జీ లేద‌నీ, ఇదీ అదీ లేద‌నీ, చిన్న చిన్న కార‌ణాల‌ను ప‌ట్టుకుని కేసులు పెట్టి పోలీస్టేష‌న్లో ప‌డేస్తున్నార‌న్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు అని ప్రశ్నించారు? ఆ త‌రువాత‌, మ‌రోసారి పాల‌న గురించి మాట్లాడుతూ… చాలా చ‌క్క‌ని పాల‌న అన్నారు. యంగ్ ఫెలో, పైనా కిందా ప‌డుతూ లేస్తున్నాడు అంటూ సీఎం జ‌గ‌న్ ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అప్ప‌టికీ ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ త‌న అబ్బాయి లాంటివాడేన‌నీ, అయితే ముఖ్య‌మంత్రి సీట్లో కూర్చున్నాడు కాబ‌ట్టి దాన్ని నేను మ‌ర్చిపోకూడ‌ద‌న్నారు. ప్ర‌భుత్వంలో మ‌న విన్న‌పాల‌ను ఆల‌కించేవారు లేక‌పోతే న్యాయ‌పోరాటం ఎవ‌రికైనా త‌ప్ప‌ద‌నీ, త‌న‌దీ అదే ప‌రిస్థితి అని జేసీ వ్యాఖ్యానించారు.

ముఖ్య‌మంత్రి అయ్యాక రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల విష‌యంలో ఒక లిస్టు వేసుకుని మ‌రీ ఒక్కొక్క‌ర్నీ జ‌గ‌న్ టార్గెట్ చేసుకుని ఆ విధంగా ముందుకు సాగుతున్నారు అనే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్న సంద‌ర్భం ఇది! గ‌తంలో అంటే… జ‌గ‌న్ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు జేసీ దివాక‌ర్ రెడ్డి సోద‌రుడు ప్ర‌భాకర్ రెడ్డి ఓ టెంటు వేసి మ‌రీ రోడ్డు మీద బైఠాయించి జ‌గ‌న్ మీద తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. వాటిని జ‌గ‌న్ మ‌ర‌చిపోయార‌నుకోలేం క‌దా? ఇక‌, సంద‌ర్భం వ‌చ్చిన ప్ర‌తీసారీ జ‌గ‌న్ మీద జేసీ దివాక‌ర్ రెడ్డి విమ‌ర్శ‌లూ వ్యంగ్యాస్త్రాలు చెప్పాల్సిన ప‌నిలేదు! ఎంత కాద‌నుకున్నా, ప్ర‌భుత్వం ఇలాంటి చ‌ర్య‌లు తీసుకునే సంద‌ర్భాలు వ‌చ్చిన‌ప్పుడు అవి గుర్తుకు రాకుండా ఉంటాయ‌ని అనుకోలేం క‌దా! ఇప్పుడు బ‌స్సులు సీజ్ లు జ‌రుగుతుంటే… న్యాయ‌పోరాట‌మే శ‌ర‌ణ్యం అన్న‌ట్టుగా జేసీ మాట్లాడుతున్నారు. అదెలా సాగిస్తారో వేచి చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close