ఒక్క కేసుకే జగన్‌కు వల్లభనేని వంశీ సరెండర్..!?

ఒక్క కేసుకే వల్లభనేని వంశీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సరెండర్ అయిపోయారా..? ప్రస్తుత పరిస్థితి చూస్తూంటే అంతే ఉంది. తనపై అక్రమ కేసులు పెట్టారంటూ.. ప్రెస్‌మీట్‌లో ఆరోపణలు గుప్పించిన ఒక్క రోజుకే.. ఆయన ముఖ్యమంత్రి నివాసం వద్ద ప్రత్యక్షమయ్యారు. కొడాలి నాని, పేర్ని నానిలతో కలిసి.. జగన్ వద్దకు వెళ్లారు. అరగంటకుపైగా జగన్ తో సమావేశమయ్యారు. తనపై పోలీసులు పెట్టిన అక్రమ కేసుల గురించి వివరించానని ఆయన మీడియా వర్గాలకు సమాచారం ఇచ్చారు. అయితే.. ఎమ్మెల్యేపై.. పై స్థాయిలో తెలియకుండా అక్రమ కేసులు పెట్టే అవకాశం లేదు. ఆ మాత్రం తెలియకుండా.. వల్లభనేని వంశీ ఇంత కాలం రాజకీయాల్లో ఉండరు.

విషయం తెలిసి కూడా.. ఆయన నేరుగా.. ముఖ్యమంత్రి వద్దకు వెళ్లారంటే.. సరెండర్ అయిపోయినట్లేనని… టీడీపీ వర్గాలు సెటైర్లు ప్రారంభించాయి. వైసీపీ వర్గాలు మాత్రం.. దీన్నో అడ్వాంటేజ్ గా తీసుకున్నాయి. వల్లభనేని వంశీనే… వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారని.. కలసి పని చేసేందుకు సిద్ధమని జగన్ కు చెప్పారన్న ప్రచారం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం చంద్రబాబును.. ఈ ఉదయం సుజనాను.. వంశీ కలిశారు. పార్టీ మార్పుపై ఆయన ఎక్కడా బహిరంగంగా ప్రకటించలేదు. కానీ జగన్ ను కలిసి మాత్రం.. తాను కేసుల విషయంలో ఎంత భయపడుతున్నారో బయట పెట్టుకున్నారని అంటున్నారు.

వల్లభనేని వంశీకి దూకుడైన నేతగా పేరుంది. ఒకప్పుడు ఆయన పరిటాల రవి అనుచరుడిగా ఉండేవారు. దాంతో.. ఆ కుటుంబానికీ సన్నిహితులే. ఆ బ్యాక్ గ్రౌండ్ చూసి.. ఆయన కేసులకు భయపడే రకం కాదని అందరూ అనుకున్నారు. కానీ కొత్త ప్రభుత్వం వచ్చాక ఒక్క కేసుకే భయపడిపోయారన్న సెటైర్లు రెండు పార్టీల్లోనూ వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్నికల్లో ప్రజలకు పరీక్ష పెడుతోన్న జగన్ రెడ్డి..!?

ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలను జగన్ రెడ్డి పరిక్షీస్తున్నట్టు ఉంది. సొంత చెల్లి మీడియా ముంగిటకు వచ్చి జగన్ నిజస్వరూపం బయటపెడుతున్నా నిజాన్ని నిందగా చిత్రీకరించుకుంటూ జనం మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుండటం...

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

HOT NEWS

css.php
[X] Close
[X] Close