ఆగమేఘాల మీద పోలవరం పనులు ప్రారంభించిన మేఘా..!

పోలవరం పనులను… రివర్స్ టెండరింగ్ పొందిన మేఘా ఇంజినీరింగ్ సంస్థ ప్రారంభించింది. స్పిల్ వే వద్ద నీటిలోనే భూమిపూజ చేసి.. మేఘా ఇంజినీరింగ్ కంపెనీ ప్రతినిధులు.. షెడ్యూల్ ప్రకారం పనులు పూర్తి చేస్తామని తెలిపారు. రివర్స్ టెండర్లపై ప్రభుత్వం విధించిన స్టేను.. హైకోర్టు నిన్ననే వేకెట్ చేసింది. దీంతో.. రాత్రికి రాత్రే మేఘా కంపెనీతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. తెల్లవారే సరికి… కొన్ని ప్రొక్లెయిన్లను.. పోలవరం ప్రాజెక్ట్ సైట్ వద్దకు తీసుకొచ్చి… వాటికి పూజలు చేసి.. పనులు ప్రారంభించినట్లుగా ప్రకటించారు. గత కాంట్రాక్ట్ ను రద్దు చేసినప్పుడు ప్రభుత్వం.. నవంబర్ ఒకటో తేదీ నుంచి పనులు ప్రారంభిస్తామని ప్రకటించింది.

దాని ప్రకారం.. ఈ రోజులు పనులు ప్రారంభిస్తున్నట్లుగా భూమిపూజ చేశారు. అయితే.. పోలవరం దగ్గర ఇప్పటికీ వరద ఉంది. అప్రోచ్ రోడ్లన్నీ నీటిలో మునిగి ఉన్నాయి. వరద తగ్గిన తర్వాత ఆ ఆప్రోచ్ రోడ్లు మళ్లీ ఉపయోగపడే పరిస్థితి లేదు. వాటిని మళ్లీ వేయాలి. భారీ యంత్రాలను తెప్పించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో.. చెప్పినట్లుగా పనులు ప్రారంభిస్తున్నట్లుగా భూమిపూజ చేశారు కానీ.. పనులు మాత్రం… ఇప్పటికిప్పుడు ప్రారంభమయ్యే అవకాశం లేదు. మరో వైపు.. పోలవరం పనుల ప్రారంభానికి … గత కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడం కూడా.. ఓ అడ్డంకిగా మారే అవకాశం కనిపిస్తోంది.

భూమిపూజ కోసం మేఘా సంస్థ తీసుకొస్తున్న కొన్ని యంత్రాలను గతంలో పని చేసిన సబ్‌కాంట్రాక్టర్లు, కార్మికులు అడ్డుకున్నారు. తమ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సబ్‌కాంట్రాక్టర్లు, కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీస్‌ రక్షణలో ప్రాజెక్టు వద్దకు యంత్ర సామాగ్రిని చేర్చారు. 2020కల్లా ప్రాజెక్టును పూర్తి చేస్తామని.. ముందుగా స్పిల్ వే పనులను ప్రారంభిస్తామని… మేఘా సిబ్బంది తెలిపారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్నికల్లో ప్రజలకు పరీక్ష పెడుతోన్న జగన్ రెడ్డి..!?

ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలను జగన్ రెడ్డి పరిక్షీస్తున్నట్టు ఉంది. సొంత చెల్లి మీడియా ముంగిటకు వచ్చి జగన్ నిజస్వరూపం బయటపెడుతున్నా నిజాన్ని నిందగా చిత్రీకరించుకుంటూ జనం మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుండటం...

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

HOT NEWS

css.php
[X] Close
[X] Close