రవిప్రకాష్ పై కేసుల్లో హైకోర్టు కీలక ఆదేశాలు..!

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్, టీవీ9 కొత్త యాజమాన్యం కూర్చుని తమ సమస్యను పరిష్కరించుకోవాలని హైకోర్టు సూచించింది. తనపై అక్రమ కేసులు పెట్టారని.. వాటిని కొట్టి వేయాలంటూ.. రవిప్రకాష్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఈ సూచన చేసింది. ఈ నెల పదిహేనో తేదీ కల్లా.. రెండు పార్టీలు కూర్చుని చర్చించుకుని సమస్యను పరిష్కరించుకుని.. తమకు తెలియజేయాలని హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల పదిహేనో తేదీకి వాయిదా వేసింది. టీవీ9 గ్రూప్ నుంచి రవిప్రకాష్‌ను తొలగించిన తర్వాత.. ఆయనపై కొత్త యాజమాన్యం అనేక కేసులు నమోదు చేసింది. వాటిలో ఫోర్జరీ, నిధుల దుర్వినియోగం, అక్రమంగా బోనస్ తీసుకోవడం, నకిలీ ఈమెయిల్ సృష్టించడం లాంటివి ఉన్నాయి.

మొదటగా నమోదు చేసిన కేసుల్లో… రవిప్రకాష్ ముందస్తు బెయిల్ తీసుకున్నారు. అయితే.. తరవాత నమోదు చేసిన కేసుల్లో రవిప్రకాష్‌కు అలాంటి అవకాశం ఇవ్వకుండా… ఫిర్యాదు చేసిన రోజే.. అరెస్ట్ చేశారు. దీంతో.. దాదాపుగా రెండు వారాల పాటు రవిప్రకాష్ జైల్లో ఉండాల్సి వచ్చింది. అప్పటికీ.. రవిప్రకాష్ పై నమోదైన కేసులు.. పోలీసులు తీసుకుంటున్న తీవ్ర చర్యలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చిన్న చిన్న కేసులతో మనిషిని జీవితాంతం జైల్లో పెట్టాలనుకుంటున్నారా అని ప్రశ్నించింది. తర్వాత ఆ కేసులపై..బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో.. క్వాష్ పిటిషన్లపై విచారణ జరుగుతోంది.

ఇవన్నీ… వ్యక్తిగత, సివిల్ వివాదాల కిందకు వస్తాయని.. న్యాయనిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో హైకోర్టు కూడా.. కూర్చుని సమస్యను పరిష్కరించుకోవాలని ఆదేశించింది. అయితే.. టీవీ9 మాజీ సీఈవోకి.. కొత్త యాజమాన్యానికి మధ్య ఇప్పటికి సరిపడని పరిస్థితులు ఉన్నాయి. వ్యాపార వ్యవహారాల్లోనే కాదు… ఇప్పుడు వ్యక్తిగతంగానూ వారి మధ్య దూరం పెరిగింది. సమస్యను పరిష్కరించుకోవాలంటే.. రెండు వర్గాలు.. రాజీపడాల్సి ఉంటుంది. మరి ఇది సాధ్యమయ్యే విషయమో కాదో మరి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ధర్మాన చెప్పింది అబద్దమని తేల్చిన జగన్

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో ప్రభుత్వంలో ముఖ్యమంత్రి.. రెవిన్యూ మంత్రి వేర్వేరుగా స్పందిస్తున్నారు. ఇద్దరూ ఒకటే మాట్లాడితే ఏ సమస్యా ఉండదు. కానీ ఇద్దరూ వేర్వేరుగా ప్రకటిస్తున్నారు. మంత్రి ధర్మాన చట్టం అమలు...

ఫేక్ పోస్టులు , కేసుల చుట్టూ తెలంగాణ రాజకీయం !

సోషల్ మీడియాను దుర్వినియోగం చేసి ఇష్టం వచ్చినట్లుగాఫేక్ చేసుకుంట ఒకరిపై ఒకరు బురద చల్లుకోడానికి చేస్తున్న రాజకీయం తెలంగామణలో కేసులు, అరెస్టుల వరకూ వెళ్లింది. కాంగ్రెస్ పార్టీ అమిత్ షా వీడియోను ట్విస్ట్...

సుకుమార్ కుమార్తెకు దాదా ఫాల్కే అవార్డ్

డైరెక్టర్ సుకుమార్‌ కుమార్తె సుకృతి వేణి సినీ రంగప్రవేశం చేసింది. ఆమె ప్రధాన పాత్రలో న‌టించిన చిత్రం గాంధీ తాత చెట్టు. ఈ చిత్రాన్ని గ‌తంలో ప‌లు ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో ప్రద‌ర్శించారు....

టీంమిండియాకి ‘ముంబై ఇండియన్స్’ కలవరం

కొత్త కుర్రాళ్ళతో టీ20 ప్రపంచకప్ బరిలో దిగుతుందని భావించిన భారత క్రికెట్ జట్టు.. అనూహ్యంగా సీనియర్లతోనే సరిపెట్టుకుంది. 2022 టీ20 ప్రపంచకప్‌లో పోటీపడిన జట్టులో ఎనిమిది మందికి మరోసారి అవకాశం వచ్చిందంటే.. ఈ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close