ఏపీ గురించి మాట్లాడేది తెలంగాణ సలహాదారులా..?

ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు దిగజారిపోతున్నా.. మీడియా విలువలకు పాతరేస్తున్నా.. మీడియా పెద్దల ముసుగులో దేవులపల్లి అమర్, రామచంద్రమూర్తి సమర్థించడంపై.. టీడీపీ నేతలు భిన్నమైన విశ్లేషణ చేస్తున్నారు. వారిద్దరూ తెలంగాణ వారు కాబట్టి.. ఏపీ సర్వనాశనమైనా పర్వాలేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారని మండి పడుతున్నారు. ఏపీలో జీవో గురించి తెలంగాణ వాసులు అయిన అమర్, రామచంద్రమూర్తి మాట్లాడటం ఏమిటని టీడీపీ సీనియర్ నేత యనమల ప్రశ్నించారు. ఆంధ్రావాడు కాదు కాబట్టే మీడియాపై విడుదల చేసిన జీవోను అమర్ సమర్ధిస్తున్నారని యనమల మండిపడ్డారు. పాత జీవోనే రాజ్యాంగానికి వ్యతిరేకమని అప్పుడు.. టీడీపీ సహా ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు వ్యతిరేకించాయన్నారు.

ప్రజాస్వామ్యవాదులంతా ఏకమై జాతీయస్థాయిలో ప్రతిఘటించారని గుర్తు చేశారు. యనమల వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో… నామినేటెడ్ పదవులు పొంది.. కీలకంగా వ్యవహరిస్తున్న వారిలో అత్యధికులు తెలంగాణవారే. ముఖ్యంగా.. సలహాదారులు.. ఐ అండ్ పీఆర్ విభాగంలోని వారిలో ఎక్కువ మంది తెలంగాణ వారే ఉన్నారు. వీరిలో చాలా మంది.. తెలంగాణ ఉద్యమ సమయంలో.. ఏపీపై అనుచిత వ్యాఖ్యలు చేసినవారే. ఇప్పుడు వారంతా.. ఏపీ ప్రజలు పన్నులుగా కడుతున్న సొమ్ములే రూ. లక్షలకు లక్షలు జీతాలుగా తీసుకుంటూ.. వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. సలహాదారులుగా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని అంటున్నారు.

ఇప్పటికిప్పుడు కాకపోయినా ముందు ముందు.. ఏపీ సర్కార్ లో కీలక బాధ్యతల్లో ఉన్న తెలంగాణ వారెంత మంది అన్నదానిపై.. చర్చ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. యనమల దాని కోసం.. ఏ బేస్ సిద్ధం చేశారు. ముందు ముందు.. సందర్భం వచ్చినప్పుడల్లా.. ఏపీ ప్రభుత్వంలో తెలంగాణ వాదం.. హైలెట్ కానుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

నోరు జారిన ర‌చ‌యిత‌.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

తోట‌ప‌ల్లి మ‌ధు... ఈ త‌రానికి పెద్ద‌గా ఈ ర‌చ‌యిత పేరు తెలియ‌క‌పోవొచ్చు కానీ, 90ల్లో వ‌చ్చిన కొన్ని సినిమాల‌కు ఆయ‌న మాట‌లు అందించారు. కొన్ని పెద్ద హిట్లు కొట్టారు. న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర...

బడా భాయ్ కి కోపమొచ్చింది… ఛోటా భాయ్ కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close