బ‌న్నీ సినిమాలో ప‌వ‌న్ స్టైల్ పాట‌

ప‌వ‌న్ క‌ల్యాణ్‌కి జాన‌ప‌ద గీతాలంటే చాలా ఇష్టం. త‌మ్ముడు, ఖుషి, జానీ సినిమాల్లో జాన‌ప‌ద గీతాల్ని వినిపించారు. అవి మాస్‌కి మాంఛి చిక్ ఇచ్చాయి. ఆయా పాట‌ల్ని ప‌వ‌న్ స్వ‌యంగా ఆల‌పించాడు కూడా. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఓ జాన‌ప‌ద గీతాన్ని వినిపించ‌డానికి రెడీ అయ్యాడు. అల్లు అర్జున్ – త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో `అల వైకుంఠ‌పుర‌ములో` తెరకెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో శ్రీ‌కాకుళం ఏరియాల్లో బాగా పాపుల‌ర్ అయిన ఓ జాన‌ప‌ద గీతాన్ని వాడుకుంటున్నారు. ఈ పాట‌ని త‌మ‌న్ త‌న‌దైన స్టైల్‌లో స్వ‌ర‌ప‌రిచాడ‌ని తెలుస్తోంది. అయితే ఈ పాట ఆల్బ‌మ్‌లో ఉండ‌దు. సినిమాలో మాత్ర‌మే క‌నిపిస్తుంది, వినిపిస్తుంది. ఈ పాట‌ని అల్లు అర్జున్ పాడ‌తాడా, లేదంటే.. ఎవ‌రితోనైనా పాడిస్తారా? అనేది తెలియాల్సివుంది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ సినిమా నుంచి రెండు పాట‌లు విడుద‌ల‌య్యాయి. అవి రెండూ బాగా పాపుల‌ర్ అయ్యాయి. వాటికి మించి ఈ ఫోక్ సాంగ్ ఉండ‌బోతోంద‌ట‌. మ‌రి అది ఏ స్థాయిలో పేలుతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close