రాజన్న క్యాంటీన్లు ఏమయ్యాయి..?

తెలుగుదేశం హయాంలో ప్రారంభమైన అన్నక్యాంటీన్లను కొత్త ప్రభుత్వం రాగానే నిలిపివేసింది. వాటితో పాటు రాజన్న క్యాంటీన్లు కూడా నిలిచిపోయాయి. అన్న క్యాంటీన్లను చంద్రబాబు ప్రారంభించిన సమయంలో.. వైసీపీ నేతలు.. నియోజకవర్గాల వారీగా.. రాజన్న క్యాంటీన్లు ప్రారంభించారు. రోజా సహా… మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వరకూ పదుల సంఖ్యలో.. వైసీపీ నియోజకవర్గ స్థాయి నేతలు..రాజన్న క్యాంటీన్లు పెట్టారు. అప్పట్లో అన్న క్యాంటీన్లు ఉన్నప్పటికీ.. వాటి వల్ల మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతో వారు పెట్టారు. కొంత మందికి రూ. నాలుగుకే భోజనం పెట్టారు. తాము వచ్చినా.. రూ.ఐదుకే భోజనం ఉంటుందని.. ఆ క్యాంటీన్ల ద్వారా నమ్మకం కలిగించారు.

ఇప్పుడు.. ఎక్కడా వారి క్యాంటీన్లు కూడా నడవడం లేదు. పేదలకు రూ. 5 భోజనం అందుబాటులో లేకుండా పోయింది. అదే సమయంలో.. ఇసుక కొరతతో.. భవన నిర్మాణ కూలీలకు పనులు లేకుండా పోయాయి. కనీసం అన్న క్యాంటీన్లలో ఆకలి తీర్చుకుందామనుకున్నా..ప్రయోజనం లేకపోయింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు… ప్రారంభించిన క్యాంటీన్లను అధికారంలోకి రాగానే ముసేశారు. ప్రభుత్వం తరపున నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్లనూ క్లోజ్ చేశారు. అంటే.. తాము పెట్టడం లేదు.. ప్రభుత్వం తరపున పెట్టనివ్వడం లేదు.

ఇప్పటికీ టీడీపీ నేతలు పలు చోట్ల అన్న క్యాంటీన్లు పెట్టిన దగ్గరే.. దాతల సాయంతో…భోజన ఏర్పాట్లు చేశారు. ఉపాధి కోల్పోయిన కూలీలకు వీలైనంతగా… కడుపు నింపే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో.. పవన్ కల్యాణ్ కూడా ఆ ప్రయత్నం చేశారు. ప్రభుత్వం.. ఐదు రూపాయలకు భోజనం పెడుతున్నప్పుడు..పోటీగా క్యాంటీన్లు పెట్టిన వైసీపీ నేతలు.. ఇప్పుడు వాటిని మూసేయడమే కాకుండా… భోజనం పెడుతున్న టీడీపీ, వైసీపీలపై విమర్శలు చేస్తున్నారు. రాజకీయం అంటే కడుపు నింపడం కాదు.. కడుపు కొట్టడం అంటే ఇదేనేమో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వేలంపాట మాదిరి వైసీపీ మేనిఫెస్టో..!?

వైసీపీ మేనిఫెస్టో చూసిన వారందరికీ వేలంపాట గుర్తుకు రాక మానదు. టీడీపీ ఒకటి అంటే...మేము రెండు అంటాం అనే తరహలో వైసీపీ మేనిఫెస్టోను రూపొందించినట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను ఏమాత్రం అంచనా...

వైజాగ్ నుంచి పాలన… జగన్ ను జనం విశ్వసించేనా..?

మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేసిన జగన్ రెడ్దికి ఎన్నికల్లో క్యాపిటల్ ఫియర్ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. రెండో దఫా అధికారంలోకి వస్తే విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతోందని మేనిఫెస్టో విడుదల...

సేమ్ మేనిఫెస్టో : ఆశలు వదిలేసుకున్న జగన్ !

వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏ మాత్రం అమలు చేయలేపోయిన గత ఎన్నికల మేనిపెస్టోను మళ్లీ ప్రకటించారు. కాకపోతే గతం కన్నా కాస్తంత ఎక్కువ డబ్బులు ఇస్తానని...

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close