పాకిస్తాన్‌లో ఆ విశాఖ కుర్రాడు “సాహసం” చేస్తున్నాడా..?

సాహసం అనే సినిమాలో గోపీచంద్… తాత ముత్తాతల నిధి.. పాకిస్థాన్‌లో ఉందని.. దాన్ని తీసుకోవడానికి సాహసయాత్ర చేస్తారు. నేరుగా పాకిస్తాన్‌లోకి వెళ్తాడు. ఇప్పుడు అలాంటి క్యారెక్టర్ ఒకటి.. పాకిస్థాన్‌లో పట్టుబడినట్లుగా తెలుస్తోంది. విశాఖపట్నానికి చెందిన ప్రశాంత్ అనే యువకుడు… హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తూ.. రెండేళ్ల కిందట.. కనిపించకుండా పోయాడు. హఠాత్తుగా.. ఆ యువకుడ్ని పాకిస్థాన్ పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. కోర్టు బయట… తెలుగులో మాట్లాడాడు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రశాంత్‌తో పాటు మధ్యప్రదేశ్‌కు చెందిన మరో వ్యక్తిని కూడా పాకిస్థాన్ పోలీసులు అరెస్ట్‌ చేశారు. పాస్‌పోర్టు, వీసా లేకుండా కొలిస్తాన్‌ ఎడారిలో ప్రవేశించడంతో.. పట్టుకున్నట్లుగా అక్కడి పోలీసులు చెబుతున్నారు.

భారత్‌ను ఎవరు పాకిస్థాన్‌లో పట్టుబడినా.. వారిపై కచ్చితంగా… టెర్రరిస్ట్ అనే ముద్ర వేస్తారు. పాకిస్థాన్‌లో ఏదో విధ్వంసం సృష్టించడానికి వచ్చాడని అనుకుంటారు. ఆ కోణంలోనే విచారణ జరుపుతారు. ప్రస్తుతానికి ప్రశాంత్ విషయంలో… పాకిస్తాన్ పోలీసులు కూడా అదే చెబుతున్నారు. కానీ.. అలాంటి ఆధారాలేమీ మాత్రం దొరకలేదు. అలాంటి ఆధారాలు దొరికి ఉంటే మాత్రం.. అసలు పట్టుకున్నట్లుగా కూడా చూపించేవారు కాదు. దాంతో.. ఇప్పుడు ప్రశాంత్.. అసలు… పాకిస్తాన్ ఎందుకు వెళ్లాడన్నది ఆసక్తికరంగా మారింది.

ఉన్నత విద్యావంతుడైన ప్రశాంత్… హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తూ ఉండేవారు. “లైక్ మైండెడ్” పీపుల్‌తో.. సోషల్ మీడియాలో సంబంధాలు ఏర్పడటంతో.. తన లక్ష్యం కోసం.. పాకిస్థాన్ వైపు వెళ్లాడని అంటున్నారు. టెర్రరిజం మాత్రం కాదని… సాహసం సినిమాలో… నిధుల కోసం.. సాగించిన అన్వేషణ తరహాలో… ప్రయత్నాలు చేసినట్లుగా అనుమానిస్తున్నారు. ప్రశాంత్‌ను విడిపించడానికి చర్యలు తీసుకోవాలని… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశాంత్‌ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్ క్లూజీవ్‌: ముగ్గురు హీరోయిన్ల‌తో ప్ర‌భాస్ పాట‌

ఓ మాస్ హీరో ప‌క్క‌న ఇద్ద‌రు హీరోయిన్లు డాన్స్ చేస్తే... ఆ మజానే వేరు. అలాంటిది ముగ్గురు హీరోయిన్లు చిందేస్తే... థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోవ‌డం ఖాయం. అలాంటి బ్లాస్ట్ ఒక‌టి 'రాజా సాబ్‌'లో ఉంది....

కడపలో వీధి వీధికి వైఎస్ ఫ్యామిలీ వార్ !

కడప ఎన్నికల బరి ఎవరూ ఊహించనంత కొత్త మలుపులు తిరుగుతోంది. వైఎస్ కుటుంబ సభ్యులంతా రెండు వర్గాలుగా విడిపోయి ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ , అవినాష్ రెడ్డి కోసం ...

నాగ్ చేతి నిండా మ‌ల్టీస్టార్ల‌ర్లే!

సీనియ‌ర్ హీరోలు పంథా మార్చుకొంటున్నారు. సినిమా అంతా త‌మ భుజాల‌పైనే న‌డ‌వాల‌ని కోరుకోవ‌డం లేదు. క‌థ‌లో భాగం అయితే చాల‌నుకొంటున్నారు. అందుకే వాళ్ల‌కు మంచి పాత్ర‌లు ద‌క్కుతున్నాయి. నాగార్జున కూడా అదే బాట‌లో...

చేతిలో 8 సినిమాలు.. మ‌రీ ఇంత బిజీనా?

సుహాస్‌.. ఒక‌ప్పుడు బుల్లి తెర‌పై క‌నిపించాల‌ని త‌హ‌త‌హ‌లాడాడు. అదృష్టానికి ప్ర‌తిభ తోడై, మంచి క‌థ‌లు వ‌చ్చి, ఇప్పుడు బిజీ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు సుహాస్ డేట్లు హాట్ కేకులు. చిన్న సినిమా, కాన్సెప్ట్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close