అసెంబ్లీ సమావేశాల్లో అమరావతినే హాట్‌టాపిక్..!

అమరావతి విషయంలో.. అసెంబ్లీ సమావేశాల్లో క్లారిటీ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. జీఎన్‌రావు అనే మాజీ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో వేసిన నిపుణుల కమిటీ.. అసెంబ్లీ సమావేశాల్లోపే… నివేదిక ఇవ్వనుంది. ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతిలో పర్యటించిన రోజున..ఈ కమిటీ సభ్యులు జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అప్పుడు.. జగన్… అసెంబ్లీ సమావేశాల్లోపు.. నివేదిక ఇవ్వాలని సూచించారు. దానికి వారు అంగీకరించారు. నిజానికి ఈ కమిటీని నియమించిన ఉద్దేశం.. నగరాలు, పట్టణాల సమగ్రాభివృద్ధికి సూచనలు చేయడం. కానీ.. బొత్స మాత్రం.. ఇది కేవలం.. రాజధానికి సంబంధించినదని.. ఈ కమిటీ సిఫార్సు మేరకే.. రాజధానిని కొనసాగిస్తామని చెప్పుకొస్తున్నారు. దీంతో.. రాజధానిపైనే సిఫార్సులు చేస్తుందని.. వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

అసెంబ్లీ సమావేశాల్లో అమరావతిపై ప్రభుత్వం నిర్ణయం ప్రకటించే అవకాశం ఉండటంతో.. ఒత్తిడి పెంచేందుకు టీడీపీ కొత్త మార్గాలు ఎంచుకుంటోంది. అన్ని ఇతర పార్టీలు, సంఘాలతో కలిసి.. ఓ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసింది. రాజధాని అమరావతిలో ఇప్పటివరకూ జరిగిన పురోగతి, రైతులిచ్చిన భూమి, రైతులకు తిరిగి అందించిన రిటర్నబుల్ ప్లాట్లు, రాజధాని అమరావతి ప్రస్తుత పరిస్థితి, అమరావతిపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ప్రభుత్వంపై రాజధాని నిర్మాణం పట్ల ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు. అన్ని రాజకీయపక్షాలు ఏకమై రాజధానిపై గళం విప్పాలని భావిస్తున్నారు..

నిజానికి ఇటీవల నిర్వహించిన సీఆర్డీఏ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధానిలో 50 శాతం పైబడి జరిగిన నిర్మాణాలను కొనసాగించాలని సీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. రైతులకిచ్చిన ప్లాట్లలో మౌలిక సదుపాయాల కల్పన కోసం కూడా ఏర్పాట్లు చేయాలని సూచించారు. రహదారుల నిర్మాణంపై కూడా స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అయితే రాజధాని రైతులు మాత్రం సీఎం జగన్ ప్రకటనలను పెద్దగా నమ్మడం లేదు. నిర్మాణాలను ఆపొద్దని జగన్ చెప్పినప్పటికీ… అధికారుల పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ప్రభుత్వం కూడా.. ఊరకే మాట వరుసకు ఆ మాట చెప్పినట్లుగా ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close