“ఆనం”కు షోకాజ్..! గెంటివేత ఖాయమా..?

నెల్లూరు జిల్లా వైసీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నెల్లూరులో మాఫియా రాజ్యం ఏలుతోందంటూ.. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో కలకలం రేపాయి. ఇలాంటి వ్యాఖ్యలను ప్రస్తుత పరిస్థితుల్లో సహిస్తే.. అది అన్ని జిల్లాలకు వ్యాపిస్తుందని.. ఆ తర్వాత పార్టీ అదుపు తప్పుతుందన్న భావనతో.. వైసీపీ హైకమాండ్ శరవేగంగా దిద్దుబాటు చర్యలను ప్రారంభించింది. అయితే.. అవి ఆనంను బుజ్జగించడం కాకుండా.. ఆయనపై చర్య తీసుకునే దిశగా ఉన్నాయి. ముందుగా.. ఆయన వ్యాఖ్యలపై వివరణ కోరుతూ.. షోకాజ్ నోటీసులు జారీ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

ఇప్పటికే వైసీపీ వర్గాలు.. ఆనంపై వ్యతిరేక ప్రచారం ప్రారంభించాయి. వెంకటగిరి నియోజకవర్గంలో ..జరుగుతున్న సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ కు వెళ్లడం.. ఆనంకు నచ్చలేదని.. ప్రజాధనాన్ని ఆదాయం చేయడాన్ని ఆయన సహించలేక.. ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చేలా మాట్లాడుతున్నారన్న ప్రచారాన్ని.. అంతర్గతంగా ప్రారంభించాయి. ఆయన మంత్రి అనిల్ ను గురి పెట్టారని… వైసీపీ వర్గాలు బహిరంగంగానే చెబుతున్నాయి. బెట్టింగ్, భూ, ఇసుక మాఫియా అంటే.. మంత్రి అనిలే గుర్తుకు వస్తారన్న ఉద్దేశంతో అలా వ్యాఖ్యానించారని చెబుతున్నారు.

నిజానికి మంత్రి అనిల్ కుమార్ తండ్రి .. ఆనం కుటుంబం సాయంతోనే రాజకీయాల్లో ఎదిగారు. ఆయన ఆకస్మిక మృతితో అనిల్ కుమార్.. రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పుడు ఆనం స్థానాన్ని ఆయన కైవసం చేసుకున్నారు. ఆనం రామనారాయణరెడ్డికి ఇది కూడా అసంతృప్తిగా ఉంది. జిల్లాలో అత్యంత సీనియర్‌ను అయిన తనకు.. కేవలం.. నియోజకవర్గ నేతగా మార్చడాన్ని ఆయన భరించలేకపోతున్నారంటున్నారు. ఇప్పుడు.. ఈ షోకాజ్ పరిణామాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయోనని వైసీపీలో ఆసక్తి వ్యక్తమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మాఫియాను అంతం చేసేందుకే కూటమి : అమిత్ షా

ఆంధ్రప్రదేశ్ భూ మాఫియాను అంతం చేసి అమరావతిని రాజధానిగా చేసేందుకు కూటమిగా ఏర్పడ్డమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ధర్మవరంలో ఎన్నికల ప్రచారసభకు హాజరయ్యారు. చంద్రబాబు కూడా అమిత్ షాతో...

విష ప్ర‌చారాన్ని తిప్పి కొట్టిన ‘గెట‌ప్’ శ్రీ‌ను!

'జ‌బ‌ర్‌ద‌స్త్' బ్యాచ్‌లో చాలామంది ఇప్పుడు పిఠాపురంలోనే ఉన్నారు. జ‌న‌సేనానికీ, కూట‌మికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేస్తున్నారు. జ‌బ‌ర్‌ద‌స్త్ బ్యాచ్ ఇలా స్వ‌చ్ఛందంగా ప్ర‌చారానికి దిగ‌డం.. వైకాపా వ‌ర్గానికి న‌చ్చ‌డం లేదు. దాంతో వాళ్ల‌పై ర‌క‌ర‌కాల...

ఏడు మండలాలు కాదు. ఐదు గ్రామాలే అంటున్న కాంగ్రెస్ !

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోల ఐదు గ్రామాల ప్రస్తావన తీసుకు వచ్చింది. ఏపీలోని ఐదు గ్రామాలను తెలంగాణలో కలుపుతామని ప్రకటించింది. దీంతో కొత్త వివాదం ప్రారంభమయింది. ఇది ఓ రకంగా గట్టు తగాదా...

నిరాసక్తంగా జగన్ ప్రచారం – ఆశలు వదిలేసుకున్నట్లే !

ఏపీ సీఎం జగన్ ప్రచారానికి కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. రెండు, మూడు రోజులకో సారి తాడేపల్లి ప్యాలెస్ కు పరిమితమవుతున్నారు. ప్రచార సభల్ని పరిమితం చేసుకుంటున్నారు. ఎన్నికల షెడ్యూల్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close