చంద్రబాబుపై ఏసీబీ కోర్టులో సాక్ష్యం చెప్పడానికి లక్ష్మిపార్వతి వెనుకడుగు..!

చంద్రబాబుకు ఆదాయానికి మించి ఆస్తులున్నాయని.. ఏసీబీతో విచారణ చేయించాలని.. లక్ష్మిపార్వతి.. పదిహేనేళ్ల కిందట పిటిషన్ వేసింది. ఇప్పుడు.. ఆ కేసు విచారణకు ఆమె ముందుకు రావడం లేదు. అమె స్వయంగా కోర్టుకు హాజరై.. సాక్ష్యాన్ని ఇవ్వాల్సి ఉంది. కానీ.. కోర్టు ముందుకు వచ్చేందుకు ఆమె సిద్ధంగా లేరు. ఇప్పటికే.. రెండు, మూడు వాయిదాలు పడిన ఆ కేసు.. లక్ష్మిపార్వతి రాని కారణంగా మరో సారి వాయిదా పడింది. ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసిన నందమూరి లక్ష్మీపార్వతి సాక్ష్యాన్ని నమోదు చేయాల్సి ఉండగా.. ఆమె తన తరఫున సీనియర్‌ న్యాయవాది హాజరవుతారని, అప్పటి వరకూ కేసు విచారణను వాయిదా వేయాలని ఆమె తరపు న్యాయవాది కోర్టును కోరారు.

దాంతో కేసు విచారణ ఈ నెల 20కి వాయిదా పడింది. చంద్రబాబుపై.. లక్ష్మిపార్వతి 2005లో ఈ పిటిషన్ వేశారు. అప్పట్లో ఈ కేసు విషయంలో హైకోర్ట్ విచారణ నిలిపివేస్తూ స్టే ఇచ్చింది. ప్రస్తుతం ఆ స్టే పై ఎటువంటి పొడిగింపు లేకపోవడంతో విచారణ ప్రారంభించాలని ఏసీబీ కోర్టు జడ్జి ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. చాలా కాలం అయినందున.. కేసు విచారణను కొనసాగంచాలా.. పిటిషన్ ఉపసంహరించుకుంటారా.. అని ఓ సందర్భంలో కోర్టు లక్ష్మిపార్వతిని ప్రశ్నించింది.

దానికీ కూడా ఆమె.. స్పష్టమైన సమాచారాన్ని.. కోర్టుకు ఇవ్వలేదు. ఆ తర్వాత లక్ష్మీపార్వతి సాక్ష్యాన్ని నమోదు చేయాలని సూచిస్తూ కేసును గతనెల 25 వ తేదీకి వాయిదా వేశారు. అప్పుడు కూడా.. లక్ష్మిపార్వతి ముందుకు రాలేదు. ఇప్పుడు కూడా.. అదే పరిస్థితి. అసలు పిటిషన్ వేసిన లక్ష్మిపార్వతి ఇప్పుడు కూడా కోర్టు ముందుకు వచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదు. తన తరపున సీనియర్ లాయర్‌ను పంపుతాననే.. చెబుతున్నారు కానీ.. తాను హాజరవుతానని చెప్పడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

43వేల కోట్లతో రోడ్లేశాం కానీ వర్షాలకు కొట్టుకుపోయాయి : జగన్

జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చింది చెప్పరు.. రాసుకొచ్చిందే చెబుతారు. రాసిచ్చే వారు ఏమి రాసిచ్చారో.. ఆయన ఏమి చదివారో కానీ.. మేనిఫెస్టోను రిలీజ్ చేసేటప్పుడు రోడ్ల ప్రస్తావన తెచ్చారు. టీడీపీ హయాం కన్నా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close