ఏపీ సర్కార్ వారి రహస్య జీవోల పరంపర..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారదర్శకతకు పెద్ద పీట వేశామని చెబుతోంది…కానీ పాలనలో ఆ పరిస్థితులు కనిపించడం లేదు. కేవలం.. ఆరు అంటే.. ఆరు నెలల్లో రహస్య జీవోలు పెద్ద ఎత్తున రిలీజ్ చేయడమే దీనికి కారణం. జీవో రిలీజ్ చేసినట్లుగా..ఆ జీవో నెంబర్ ఉంటుంది కానీ.. అందులో ఉన్న మ్యాటర్ ఏంటో మాత్రం.. కాన్ఫిడెన్షియల్‌గా ఉంచుతున్నారు. ఇప్పటికీ… ఆ జీవోల వివరాలేమిటో బయటకు రావడం లేదు.

రెవిన్యూలోనే రహస్యాలు ఎక్కువ..!

ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విడుదలైన రహస్య జీవోల్లో అత్యధికం.. రెవిన్యూ శాఖ నుంచే వచ్చాయి. ఈ శాఖ దాదాపుగా 31 జీవోల్లోని వివరాలను కాన్ఫిడెన్షియల్‌గా పేర్కొంది. అంటే.. సగటున.. నెలకు ఐదు జీవోలు ఇలా కాన్ఫిడెన్షియల్‌గా ఉన్నాయి. ఆ తర్వాత పంచాయతీరాజ్ శాఖలో పది, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లో మరో పది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌లో మరో పది జీవోలు కాన్ఫిడెన్షియల్‌గా రిలీజ్ చేశారు. వాటిలో ఏముందోఇంత వరకూ బయటకు తెలియలేదు. కానీ ఆ ఆదేశాల ప్రకారం… ప్రభుత్వ పెద్దలు తాము చేయాలనుకున్నవి చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

రంగులు, అస్మదీయులకు మేళ్లు, ఖజానా దుబారా జీవోలా..?

సాధారణంగా ప్రభుత్వం జీవోలను రహస్యంగా ఉంచదు. అలా జీవోలు ఉంచారంటే.. అందులో కచ్చితంగా… విమర్శల పాలయ్యే.. ఆదేశాలు ఏవో ఉన్నాయనే అర్థం. తమ నిర్ణయాలు ప్రజలకు తెలియాలనే ప్రభుత్వాలు అనుకుంటాయి. కానీ… ఇలా పెద్ద సంఖ్యలో స్వల్ప కాలంలోనే రహస్య జీవోలు జారీ చేశారంటే… అందులో.. ప్రజాప్రయోజనాలకు విఘాతుం కలిగేలా… తమ ప్రయోజనాలు చూసుకుంటూ.. పాలకులు…. ఆదేశాలు జారీ చేసుకున్నారన్న అభిప్రాయం అందరిలోనూ ఏర్పడుతుంది. రెవిన్యూ శాఖలోనే అత్యధికంగా జీవోలు జారీ కావడం వెనుక కూడా.. భారీ లోగుట్టు ఉందని అంటున్నారు. ప్రభుత్వం.. రంగుల కోసం.. రూ. రెండువేల కోట్లు ఖర్చు చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. అలా బిల్లుల చెల్లింపులోనూ.. ఖజానా దుబారా చేయడంలోనూ… కొన్ని నిర్ణయాలు వివాదాస్పదమయ్యే అవకాశం ఉందన్న కారణంగా.. వీటిని కాన్ఫిడెన్షియల్‌గా ఉంచారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

రహస్య జీవోలు చెల్లవని కోర్టు తీర్పులు..!

ఏ ప్రభుత్వమైనా.. తీసుకునే ప్రతి నిర్ణయం ప్రజల ముందు ఉంచాలని… కోర్టులు చెబుతున్నాయి. కొద్ది రోజుల కిందట.. కేంద్ర ప్రభుత్వం కూడా.. అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి రహస్య జీవోలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ.. రహస్యాలు ఉండకూడదని..జీవోలు పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలని ఆదేశించింది. తెలంగాణలోనూ ఇలాంటి రహస్య జీవోలు భారీగా ఉండటంతో.. పేరాల శేఖర్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే జీవోల విషయంలో పారదర్శకత ఉండాలని, రహస్య జీవోలు చెల్లవని వాటన్నిటిని పబ్లిక్ డొమైన్ లో ఉంచాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ఈ ఆదేశాలు అన్ని ప్రభుత్వాలకూ వర్తిస్తాయి. కానీ ఏపీ సర్కార్ మాత్రం… రహస్య జీవోల్లో కొత్త పుంతలు తొక్కుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

టీ 20 ప్ర‌పంచ‌క‌ప్: భార‌త జ‌ట్టు ఇదే

జూన్‌లో జ‌ర‌గ‌బోయే టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం భార‌త‌జ‌ట్టుని బీసీసీఐ ప్ర‌క‌టించింది. రోహిత్ శ‌ర్మ‌ని కెప్టెన్‌గా నియ‌మించింది. గాయం కార‌ణంగా జ‌ట్టుకు దూర‌మై, ప్ర‌స్తుతం ఐపీఎల్ లో బ్యాటర్‌, కీప‌ర్ గా...

గాజు గ్లాస్ గుర్తుపై ఏ క్షణమైనా ఈసీ నిర్ణయం – లేకపోతే హైకోర్టులో !

జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు రిజర్వ్ చేసినప్పటికీ ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో స్వతంత్రులకు గుర్తు కేటాయించడంపై తీవ్ర వివాదాస్పదమయింది. ఈ అంశంపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్బంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close