విజయసాయిపై “వైసీపీ కాపు వర్గానికి” అంత కోపం ఉందా..?

విశాఖలో మంత్రి అవంతి శ్రీనివాస్.. ప్రత్యేకంగా తమ పార్టీకి చెందిన కాపు నేతలు, కార్యకర్తలతో ఓ విందు సభను ఏర్పాటు చేశారు. కాపుల్లో తనకు బోలెడంత పట్టు ఉందని చూపించుకోవడానికో… వచ్చే జీవీఎంసీ ఎన్నికల్లో తన వర్గానికి భారీగా టిక్కెట్లు ఇప్పించుకోవాలన్న లక్ష్యమో కానీ.. వైసీపీ నెంబర్ -2 విజయసాయిరెడ్డిని ఆ కాపు భేటీకి ముఖ్యఅతిధిగా ఆహ్వానించారు. అయితే.. అనుకున్నదొకటి.. అయిందొకటి అన్నట్లుగా పరిస్థితి మారింది. విజయసాయిరెడ్డి అలా… కాపు భేటీ ప్రాంగణంమలోకి అడుగు పెట్టారో లేదో.. ఇలా.. “జై కాపు.. జై జై కాపు” పేరుతో నినాదాలు హోరెత్తించారు. అప్పటి వరకూ కాపు కాని వాళ్లు ఇతర నేతలు వచ్చినా… ఎవరూ స్పందించలేదు. కానీ విజయసాయిరెడ్డి రాగానే ఆయనపై… కాపు నేతలు, కార్యకర్తలు చెలరేగిపోయారు.

సొంత పార్టీ నేతలు, కార్యకర్తలే.. విజయసాయిరెడ్డిపై అంత తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేయడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. చివరికి ఆయన కూడా.. తాను కాపునని చెప్పుకోవాల్సి వచ్చింది. నెల్లూరు జిల్లాలో రెడ్లను కాపులంటారని.. ఆ లెక్కన తాను కాపునని.. చెప్పుకుని వారిని.. కూల్ చేయడానికి ప్రయత్నించారు. కానీ.. ఆ మాటలు.. మరింత వెటకారంగా అనిపించాయి అక్కడున్నవారికి. అందుకే చేయాల్సినంత గందరగోళం చేశారు. ఈ సమావేశాన్ని చూపి కాపు వర్గం మొత్తం వైసీపీ వైపే ఉందని చెప్పుకోవాలని ప్లాన్ చేశారు కానీ.. సొంత పార్టీ నేతలు, కార్యకర్తలే ఆందోళనకు దిగడంతో.. పరిస్థితి నెగెటివ్‌గా మారింది.

విజయసాయిరెడ్డిపై.. కాపు వర్గం నేతలు, కార్యకర్తలు అంత తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేయడానికి ప్రధాన కారణం.. పవన్ కల్యాణ్‌పై ఆయన చేస్తున్న అనుచిత వ్యాఖ్యలేనన్న అభిప్రాయం.. ఆ సభా ప్రాంగణంలోనే వినిపించింది. పవన్ నాయుడూ అంటూ… కులాల్ని రెచ్చగొట్టేలా వ్యవహరిస్తూ.. ఆయనపై ప్యాకేజీ స్టారని.. మరొకటని.. ఇష్టం వచ్చినట్లుగా అభ్యంతరకర విమర్శలు చేస్తూంటారు విజయసాయిరెడ్డి. వాటి ప్రభావం.. ఎంత తీవ్రంగా ఉందో.. ఆయనే విశాఖలో ప్రత్యక్షంగా తెలుసుకున్నారని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వేలంపాట మాదిరి వైసీపీ మేనిఫెస్టో..!?

వైసీపీ మేనిఫెస్టో చూసిన వారందరికీ వేలంపాట గుర్తుకు రాక మానదు. టీడీపీ ఒకటి అంటే...మేము రెండు అంటాం అనే తరహలో వైసీపీ మేనిఫెస్టోను రూపొందించినట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను ఏమాత్రం అంచనా...

వైజాగ్ నుంచి పాలన… జగన్ ను జనం విశ్వసించేనా..?

మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేసిన జగన్ రెడ్దికి ఎన్నికల్లో క్యాపిటల్ ఫియర్ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. రెండో దఫా అధికారంలోకి వస్తే విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతోందని మేనిఫెస్టో విడుదల...

సేమ్ మేనిఫెస్టో : ఆశలు వదిలేసుకున్న జగన్ !

వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏ మాత్రం అమలు చేయలేపోయిన గత ఎన్నికల మేనిపెస్టోను మళ్లీ ప్రకటించారు. కాకపోతే గతం కన్నా కాస్తంత ఎక్కువ డబ్బులు ఇస్తానని...

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close