“కులం ముద్ర”పై చంద్రబాబు స్పందన టూ.. లేట్..!

అమరావతిపై ఓ సామాజికవర్గ ముద్రను ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుండి వేస్తోందని తెలిసినా.. తిప్పికొట్టేందుకు అప్పటి ప్రభుత్వం కానీ.. అప్పటి అధికార పార్టీ అయిన టీడీపీ కానీ ప్రత్యేకమైన ప్రచార ప్రణాళికలేమీ వేసుకోలేదు. ఫలితంగా దెబ్బతిన్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత వైసీపీ.. రాజధాని మార్పు కోసం.. అదే వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఇప్పుడు ఆ ప్రచారాన్ని తిప్పికొట్టకపోతే ఏం జరుగుతుందో టీడీపీకి తెలిసి వచ్చినట్లుగా ఉంది. కొద్ది రోజులుగా.. అధికారపార్టీపై.. సామాజిక కోణంలోనే ఎదురుదాడి చేస్తున్నారు. చంద్రబాబు కూడా.. ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడటం ప్రారంభించారు.

చంద్రబాబు వేసిన ప్రశ్న.. ఇప్పటి వరకూ.. రాజధాని ఒకే సామాజికవర్గానిదంటూ… జరిగిన ప్రచారాన్ని నమ్మిన వారిని ఆలోచింపచేసేలా చేసింది. అమరావతి ఒక్క సామాజికవర్గానిదే ఎలా అవుతుందనే చర్చలు.. ప్రారంభించేలా చేసింది. అదే సమయంలో.. టీడీపీ అధినేత.. మరింత దూకుడుగా వైసీపీకి కౌంటర్ ఇవ్వడం ప్రారంభించారు. రాజధానిపై కులం ముద్ర వేయడం.. వైశాచికత్వానికి నిదర్శనమని మండిపడటమే కాదు… హైదరాబాద్‌ను ఉదాహరణగా చెబుతున్నారు. తాము హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామని.. ఇప్పుడు అక్కడ కొన్ని లక్షల మంది లబ్ది పొందుతున్నారని.. వారంతా.. ఒకే సామాజికవర్గం వారా అని ప్రశ్నిస్తున్నారు. ఒక్క సామాజికవర్గం కోసమే అభివృద్ధి చేశామా… అని సూటిగానే అడుగుతున్నారు. ఓ నగరం అభివృద్ది చెందితే కుల, మత, ప్రాంతాలకు అతీతంగా… ప్రజలందరూ లబ్దిపొందుతారని గుర్తు చేస్తున్నారు.

అమరావతిపై సామాజిక ముద్ర వేసి తరలిస్తే… జగన్ టార్గెట్ పెట్టుకున్న సామాజికవర్గం నష్టపోతుంది… అలాగే.. వారి కన్నా… మూడు, నాలుగు రెట్లు ఎక్కువగా.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు నష్టపోతాయి. కానీ.. వారు నష్టపోయినా పర్వాలేదు… తాము టార్గెట్ పెట్టుకున్న సామాజికవర్గం మాత్రం నాశనమైపోవాలన్నట్లుగా అధికార పార్టీ తీరు. టీడీపీ అధినేత చంద్రబాబు.. ఈ విషయాన్ని సూటిగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజల్లో పడిపోయిన ముద్రను.. ఇప్పుడు.. చెరపగలరా.. అన్నదే.. అసలైన పాయింట్.. అందుకే.. ఈ విషయంలో చంద్రబాబు ఆలస్యంగా మేలుకున్నారని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

నోరు జారిన ర‌చ‌యిత‌.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

తోట‌ప‌ల్లి మ‌ధు... ఈ త‌రానికి పెద్ద‌గా ఈ ర‌చ‌యిత పేరు తెలియ‌క‌పోవొచ్చు కానీ, 90ల్లో వ‌చ్చిన కొన్ని సినిమాల‌కు ఆయ‌న మాట‌లు అందించారు. కొన్ని పెద్ద హిట్లు కొట్టారు. న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర...

బడా బాయ్ కి కోపమొచ్చింది… ఛోటా బాయి కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close