13వ తేదీన జగన్ – కేసీఆర్ భేటీ..!

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కాస్త గ్యాప్ తీసుకుని మరోసారి భేటీ అవబోతున్నారు. ఈ నెల పదమూడో తేదీన హైదరాబాద్‌లో జగన్ – కేసీఆర్ సమావేశం అవుతారని.. ఏపీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ భేటీ గతంలో జరిగినట్లుగా ప్రగతి భవన్‌లో జరుగుతుంది. అజెండా ఏమిటన్నదానిపై మాత్రం ఎలాంటి సమాచారం లేదు. గతంలో.. ఓ సారి ఇలానే.. సమావేశమయ్యారు. అప్పుడు అధికారులు సహా ఎవరూ లేరు. జగన్ – కేసీఆర్‌తో పాటు వారి పార్టీలకు చెందిన ఇద్దరు, ముగ్గురు మాత్రమే పాల్గొన్నారు. ఇరు రాష్ట్రాల సమస్యలపై చర్చించుకున్నట్లు ప్రకటించారు కానీ.. అధికారులు కానీ.. సమస్యల పరిష్కార ఎజెండా కానీ..లేకుండా సమావేశం అవడంపై.. చాలా విమర్శలు వచ్చాయి. దానికి తగ్గట్లుగా వారు.. పూర్తిగా రాజకీయ వ్యవహారాలపై చర్చించారని.. తర్వాత మీడియాలో వచ్చింది.

ఆ భేటీకి సంబంధించి కొన్ని వివరాలు లీకయ్యాయి. ఆ వివరాలను… జగన్మోహన్ రెడ్డి తరపున వైసీపీ ఖండించింది. కానీ.. తెలంగాణ సీఎం మాత్రం… వాటిని పట్టించుకోలేదు. ఆ తర్వాత.. వైసీపీ అధినేత జగన్ , కేసీఆర్ మధ్య దూరం పెరిగినట్లుగా ప్రచారం జరిగింది. ఉమ్మడి ప్రాజెక్ట్ గురించి జగన్ పట్టించుకోవడం మానేశారు. తానే స్వయంగా… పోలవరం నుంచి ఓ ప్రాజెక్ట్ కు… డిజైన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. బానకచర్ల హెడ్ రెగ్యూలేటర్ నిర్మించి..సీమకు నీళ్లు తరలిస్తామని చెబుతున్నారు. దీనిపై కేసీఆర్ అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు. అదే సమయంలో..జగన్మోహన్ రెడ్డి పోతిరెడ్డి సామర్థ్యాన్ని పెంచుతామని అసెంబ్లీలో ప్రకటన చేశారు. దీనిపై.. తెలంగాణలో విపక్షాలు.. కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నాయి. నాగం జనార్ధన్ రెడ్డి లాంటి నేత రాజకీయంగా జగన్ ప్రకటనను మరింతగా ఉపయోగించుకుని రంగంలోకి దిగుతున్నారు.

ఓ వైపు ఏపీలో రాజధాని ఆందోళనలు.. రోజు రోజుకు తీవ్రమవుతున్నాయి. ఇలాంటి సమయంలో.. కేసీఆర్ తో భేటీ అంటే… సహజంగానే… ప్రజల్లో ఆసక్తి ఏర్పడుతుంది. రాజధాని గురించి గతంలో.. కేసీఆర్.. డెడ్ ఇన్వెస్ట్మెంట్ అనే వ్యాఖ్యలు చేశారు. అవి జగన్ పై ప్రభావం చూపాయేమో కానీ.. రాజధానిని పూర్తి స్థాయిలో నిలిపివేసి.. అమరావతి తరలిస్తున్నారు. ఇలాంటి సమయంలో.. రాజధానిపై కేసీఆర్ సలహాలను జగన్ తీసుకుంటారనే చర్చ కూడా జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close