వైకాపా నేత ద్వారంపూడిపై గాలి విమర్శలు

తుని విద్వంసానికి వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డే కుట్రపన్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించడం అందరికీ తెలుసు. తెదేపా నేతలు, మంత్రులు కూడా వైకాపాపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. తెదేపా ఎమ్మెల్సి గాలి ముద్దు కృష్ణం నాయుడు వైకాపా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై చాలా తీవ్ర ఆరోపణలు చేసారు. అతనే తన రాయల్ పార్క్ హోటల్లో తన అనుచరులతో సమావేశమయ్యి ఈ కుట్రకు ప్లాన్ చేసారని ఆరోపించారు. వైకాపా తన రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల మధ్య కులాల చిచ్చుపెట్టడం చాలా దారుణమయిన విషయమని ఆయన అన్నారు. తుని ఘటనలకు బాధ్యులయిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేసారు. తమ ప్రభుత్వం కాపులకు, బీసీలకు ఎవరికీ అన్యాయం చేయాలని ఎన్నడూ భావించలేదని, అందరినీ సమానంగానే చూస్తుందని ఆయన అన్నారు. ఇప్పుడు కూడా బీసీలకు నష్టం జరుగకుండా కాపులకు న్యాయం చేయాలనే ఆలోచనతోనే జస్టిస్ మంజూనాద కమీషన్ ఏర్పాటు చేసామని తెలిపారు.

తుని ఘటనలో దోషులు ఎవరో కనుగొనేందుకు సిఐడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటువంటి సమయంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సి గాలి ముద్దు కృష్ణం నాయుడు ఈ కుట్రను ఎవరు పన్నారో, ఎక్కడ పన్నారో వంటి వివరాలను మీడియా ముందుకు వచ్చి తెలియజేయడం కంటే సిఐడి పోలీసులకే తెలియజేస్తే బాగుండేది కదా?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గవర్నర్ పై లైంగిక ఆరోపణలు..!!

వెస్ట్ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ పై రాజ్ భవన్ లో పని చేసే మహిళా ఉద్యోగి సంచలన ఆరోపణలు చేసింది. ఉద్యోగం పేరిట ఆనంద్ బోస్ తనను లైంగికంగా వేధించారంటూ...

రిజర్వేషన్లపై కేసీఆర్ సైలెన్స్… కవిత కోసమేనా..?

దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు, రాజ్యాంగంపై రగడ కొనసాగుతోంది. బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకు వేసినట్లేనని, రాజ్యాంగం రద్దుకు మద్దతు ఇవ్వడమేనని కాంగ్రెస్ వాదిస్తుండగా.. తాము రాజ్యాంగానికి వ్యతిరేకం కాదని, రిజర్వేషన్లను ఎట్టి...

మూగబోయిన భాగ్యనగర్ రైలు కూత…ఆ లీడర్లపై ప్యాసింజర్ల ఆగ్రహం

దాదాపు నలభై ఏళ్లపాటు పరుగులు పెట్టిన భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ రైలు కూత మూగబోయింది. మూడో రైల్వే మరమ్మత్తుల పేరిట దక్షిణ మధ్య రైల్వే అధికారులు భాగ్యనగర్ రైలును రద్దు చేశారు. ఇతర...

నెల్లిమర్ల రివ్యూ : అడ్వాంటేజ్ జనసేన లోకం మాధవి !

తెలుగుదేశం పార్టీతో పొత్తులో భాగంగా జనసేన పట్టుబట్టి తీసుకున్న నియోజకవర్గం నెల్లిమర్ల. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఈ నియోజకవర్గం పరిధిలోనే బోగాపురం ఎయిర్ పోర్టు నిర్మించాల్సి ఉంది. కానీ జగన్ దాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close