రెబెల్స్ ని వెనక్కి తగ్గించే పనిలో మంత్రి కేటీఆర్

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసింది. దీంతో అధికార పార్టీ తెరాసలో ఇప్పుడు రెబెల్స్ బెడద పీక్స్ కి చేరిపోయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగానే హెచ్చరిక లాంటి సలహాల లాంటి సూచనలు ఎన్ని చేసినా… దిగాల్సిన చోట రెబెల్స్ రంగంలోకి చాలామందే దిగారు. నామినేషన్లూ బాగానే వేశారు. అయితే, ఉప సంహరణకు 14వ తేదీ వరకూ గడువు ఉంది. అంటే, ఈ మూడ్రోజుల్లో రెబెల్స్ ని తగ్గించాలి, వీలైతే బుజ్జగించాలి, వినకుంటే వేటు వెయ్యాలి. ఇప్పుడు ఇదే పని కిం కర్తవ్యం అన్నట్టుగా రంగంలోకి దిగారు తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.

ఇవాళ్ల ఉదయం నుంచీ ఆపరేషన్ రెబెల్స్ పనిలోనే ఉన్నారు కేటీఆర్. తెల్లారి నుంచే తెలంగాణ భవన్లో సమీక్ష మొదలుపెట్టారు. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎంపీల దగ్గర్నుంచీ నియోజక వర్గాల వారీగా నివేదికలు తీసుకుంటున్నారు. దీని కోసం కేటీఆర్ ని కలిసేందుకు నాయకులు వరుసగా తెలంగాణ భవన్ కి వస్తున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా రెబెల్స్ వివరాలను ఆయనకి వివరిస్తున్నారు. చాలా నియోజక వర్గాల్లో రెబెల్స్ సంఖ్య ఎక్కువగానే ఉందనీ, ఎమ్మెల్యే స్థాయి నాయకులు చెప్పినా కొంతమంది వినే పరిస్థితిలో లేరనే అంశాన్ని కేటీఆర్ ద్రుష్టికి తీసుకెళ్లారు. దీంతో, ఆయన స్పందిస్తూ… అలాంటివారితో మరోసారి టచ్ లోకి వెళ్లాలనీ, 14వ తేదీ మధ్యాహ్నానికి ఎక్కడా రెబెల్స్ బరిలో ఉండకూడదని ఆదేశించారని తెలుస్తోంది. ఎంత చెప్పినా నామినేషన్ల ఉప సంహరణకు విననివారి మీద వేటు వెస్తున్నట్టుగా ప్రకటించాలనీ చెప్పినట్టు సమాచారం.

వేటుకి భయపడేవారు తక్కువగా ఉన్నారనీ, ఒకవేళ అలాచేస్తే పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉంటుంది కదా అనే అంశాన్ని కొంతమంది నేతలు కేటీఆర్ ముందు ప్రస్థావించినట్టు తెలుస్తోంది. అలాంటి పరిస్థితి ఉండదనీ, పార్టీ నుంచి ఒకసారి బహిష్కరణకు గురైతే, భవిష్యత్తులో మళ్లీ తెరాసలోకి వచ్చేందుకు అన్ని తలుపులూ మూసుకుపోతాయనే ముఖ్యమంత్రి కేసీఆర్ మాటను మరోసారి గుర్తుచేయాలని చెప్పినట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా, ఈ ఎన్నికల్లో అధికార పార్టీ మీద అసంత్రుప్తి వ్యక్తం చేస్తున్న సొంత పార్టీ వారే ఎక్కువమంది తయారయ్యారు. మున్సిపల్ ఎన్నికలతో మొదలైన ఈ సమస్య తాత్కాలికం అని భావించలేం. పైపెచ్చు, ఈ పరిస్థితిని కాంగ్రెస్, భాజపాలు అందిపుచ్చుకునే వ్యూహంలో రెడీగా ఉన్నాయి. రెబెల్స్ గా బరిలోకి దిగినవారితో నామినేషన్లను ఎలాగోలా నచ్చజెప్పి తీయించగలేరేమోగానీ, అలా వెనక్కి తగ్గించిన నాయకులతో తెరాసకు అనుకూలంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో పని చేయంచడం ఎంతవరకూ ఆచరణ సాధ్యం అనేదే ప్రశ్న? మున్సిపల్ ఫలితాల బాధ్యతలు ఎమ్మెల్యేలు, మంత్రుల భుజాన వేసేసినా… పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా స్పష్టమైన దిశానిర్దేశం చేయాల్సిన అవసరం కూడా కేటీఆర్ కి ఉంటుంది. మరి, రెబెల్స్ ని నూటికి నూరు శాతం మద్దతుదారులుగా మలిచే ప్రయత్నంలో కేటీఆర్ ఏ తరహా వ్యూహాన్ని అమలు చేస్తారనేది మున్ముందు చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రచారంలో పూర్తిగా వెనుకబడిన వైసీపీ – ఎటు చూసినా కూటమి !

ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ అసలు పోటీ చేస్తుందా లేదా అన్నంత దారుణంగా డల్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ నెల రోజుల పాటు బస్సు యాత్ర పేరుతో టైం...

నరేష్ ‘అల్లరి’కి పరీక్షా సమయం

నరేష్ 'అల్లరి' రూటు మార్చి అన్నీ సీరియస్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు 'ఆ ఒక్కటీ అడక్కు'తో మళ్ళీ తన అల్లరి జోన్ లోకి వచ్చారు. నరేష్ చేసిన కామెడీ సినిమాలు వరుసగా...

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు స్పెషల్ కోర్టు !

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రత్యేక విజ్ఞప్తిని సుప్రీంకోర్టుకు సీబీఐ చేసింది. అపిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ...

జగన్‌కు చేత కాదని పదే పదే సర్టిఫికెట్ ఇస్తున్న సజ్జల !

సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారుడు ఉంటే చాలు మట్టికొట్టుకుపోవడానికి అన్నట్లుగా మరిపోయింది వైసీపీ పరిస్థితి. టీడీపీ మేనిఫెస్టోను చూపించి జగన్‌కు చేత కాదని ఆయన ప్రచారం చేస్తున్న వైనం వైసీపీ నేతలకూ ఇబ్బందికరంగానే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close