రూల్ నెం 71.. ఇదీ మండలిలో టీడీపీ పాచిక..!

మూడు రాజధానుల నిర్ణయాన్ని తిరస్కరించడానికి.. తెలుగుదేశం పార్టీ అనూహ్యమైన మార్గన్ని శానసమండలిలో ఎంచుకుంది. టీడీపీ ఊహించని స్టెప్ వేయడంతో.. అవాక్కయిన అధికారపక్షం.. వెంటనే.. శాసనమండలి ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేయించింది. టీడీపీ వేసిన ప్లాన్ రూల్ నెం 71. మండలి ప్రారంభం కాగానే.. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టారు. అప్పుడే.. టీడీపీ పక్ష నేత యనమల రామకృష్ణుడు రూల్ నెం 71 ప్రకారం తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తిరస్కరించే అవకాశం రూల్ నెంబర్ 71వల్ల కలుగుతుంది. మండలిలో మెజార్టీ ఉంటే.. రూల్ నెంబర్ 71కింద తీర్మానం ప్రవేశ పెట్టవచ్చని తేలింది. వెంటనే.. మెజార్టీని శాసనమండలి లెక్కించడంతో తీర్మానం ప్రవేశపెట్టేందుకు బలం ఉందని నిర్ధారణ అయింది.

రూల్‌ 71కు మద్దతుగా 30 మంది ఎమ్మెల్సీలు నిలబడ్డారు. తీర్మానంపై చర్చను ఆమోదిస్తే ప్రభుత్వ నిర్ణయాన్ని తిరస్కరించినట్టే అవుతుంది. టీడీపీ ఈ రూట్‌లో వస్తుందని అంచనా వేయలేకపోయిన అధికారపక్షం.. తత్తరపాటుకు గురైంది. ఈ రూల్ కింద.. తీర్మానం పెట్టే అధికారం లేదని.. బుగ్గన వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే.. మండలి ప్రసారాలు నిలిచిపోయాయి. అయితే.. సాంకేతిక కారణాల వల్లే ప్రసారాలు నిలిచిపోయాయని.. ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ప్రభుత్వం అభ్యంతరం తెలిపినప్పటికీ.. రూల్ నెంబర్ 71 కింద… మండలి చైర్మన్ చర్చకు అనుమతించారు. ప్రభుత్వ తీరుపై యనమల ఓ సందర్భంలో మండిపడ్డారు.

తమ ఎమ్మెల్సీలకు.. వైసీపీ నేతలు ఫోన్లు చేయాల్సిన అవసరం ఏమి వచ్చిందని ప్రశ్నించారు. శాసనమండలిలో.. వికేంద్రీకరణ బిల్లును తిరస్కరిస్తారన్న నమ్మకం ఉండటంతో.. ఎలాగోలా గెలిపించుకోవాలన్న ఉద్దేశంతో వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఎంపీ విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి శాసనమండలి వీఐపీ గ్యాలరీ నుంచి సమావేశాలను పరిశీలిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close