చైతన్య : ఎనిమిది నెలల తర్వాత వెనక్కి చూసుకుంటే..!?

ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అయోమయంలో పడింది. ఇప్పుడు ఎటు చూసినా.. అనిశ్చితి.. ఆందోళనలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన సమయం కన్నా ఎక్కువగా పరిస్థితులు ఉద్రిక్తతంగా కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా ప్రభుత్వ బాధితులు కనిపిస్తున్నారు. ఎక్కడా అభివృద్ధి పనులు కనిపించడం లేదు. ఉద్యోగుల జీతాలకు అనిశ్చితి ఏర్పడింది. కొత్తగా నాలుగున్నర లక్షల ఉద్యోగాలిచ్చామని గొప్పగా చెప్పుకుంటున్న సర్కార్ వారికి జీతాలివ్వడం లేదు.

ఏ అంటే అమరావతి .. పీ అంటే పోలవరం..! ముందుకు కదలని ఏపీ..!

ఎనిమిది నెలల కిందటి వరకు రాజధాని అమరావతి అనే ముద్ర ప్రజల్లో బలంగా ఉంది. దశాబ్దాల పాటు .. ప్రతిపాదనలకే పరిమితమై.. కాలువల తవ్వకమే.. పెద్ద పని అన్నట్లుగా చెప్పుకున్న పోలవరం ప్రాజెక్ట్ పరుగులు పెడుతూ నిర్మాణం అవుతోంది. ఓ గేటు కూడా పెట్టేశారు. 70 శాతం నిర్మాణం పూర్తయింది. మరో ఆరు నెలల్లో పూర్తయిపోతుందని… ప్రాజెక్టును సందర్శించిన వారు అనుకున్నారు. ఇప్పుడు అది కూడా ఆగిపోయింది. ఎనిమిది నెలల తర్వాత వెనక్కి చూసుకుంటే.. ఏ అంటే అనుకున్న అమరావతి.. మూడు ముక్కలయింది. అక్కడ జోరుగా సాగిన పనులు.. ఎక్కడివక్కడ ఆగిపోయాయి. శిధిలమయ్యే పరిస్థితి ఉంది. పీ అనుకున్న పోలవరం.. కూడా అదే పరిస్థితి. రివర్స్ టెండరింగ్ కారణంగా అక్కడ పనులేమీ జరగడం లేదు.

పరిశ్రమలు, పెట్టుబడులన్నీ రివర్స్..!

ఏ అంటే అమరావతి.. పీ అంటే.. పోలవరం అనే కాన్సెప్ట్‌తో పాలన చేసిన ఏపీ సర్కార్ వాటిని మాత్రమే కాదు.. పెట్టుబడులు ఆకర్షించి.. కియా, అశోక్ లేలాండ్ లాంటి ఆటోమోబైల్ కంపెనీలు.. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, హెచ్‌సీఎల్ లంటి సాఫ్ట్‌వేర్ కంపెనీలతో పాటు.. కొన్ని వందల కంపెనీలను.. వివిధ ప్రాంతాలకు తీసుకు వచ్చి.. యువతకు ఉపాధి పెంచే ప్రయత్నం చేశారు. అనేక కంపెనీలు.. ఏపీలో పెట్టుబడులు పెట్టాడనికి ఎనిమిది నెలల కిందట వరకు.. రెడీగా ఉన్నాయి.. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఇక ఎనిమిది నెలల్లో ఏపీకి కొత్తగా వచ్చిన పరిశ్రమ లేదు. కానీ.. ఆదాని… అంబానీలు…. కొన్ని వేలకోట్ల పెట్టుబడుల ప్రతిపాదలను విరమించుకున్నారు.

ఇనుప బూట్ల చప్పుళ్లు.. జగనన్నకు పొగడ్తలు..!

అన్నీ పోను.. ఇప్పుడు… ఆంధ్రప్రదేశ్ అనిశ్చితిలో చిక్కుకుంది. ప్రభుత్వాన్ని నమ్మి తమ సర్వశ్వం అనుకుని భూములిచ్చిన రైతులు… ఇప్పుడు ఆ ప్రభుత్వం చేతిలోనే వంచనకు గురయ్యారు. తమకు న్యాయం రగాలని..రోడ్డెక్కుతున్నారు. ప్రభుత్వం తరపున పోలీసులు వారిపై ఉన్మాదంతో విరుచుకుపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. పిల్లలు, మహిళలు, వృద్ధులు ఎవరికీ లాఠీ దెబ్బల్లో తేడా చూపించడం లేదు. పోలీసుల మోహరింపుతోనే ప్రభుత్వ పాలన సాగుతోంది. ఆంధ్రప్రేదశ్ రాష్ట్రం మొత్తం అనిశ్చితి కనిపిస్తోంది. ఈ పరిస్థితి సామాన్యుల్ని సైతం ఆవేదనకు గురి చేస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close