మండలి ఎపిసోడ్‌లో బొత్స బలిపశువు..!?

శాసనమండలి ఎపిసోడ్‌లో అతి పెద్ద జీరో మంత్రి బొత్స సత్యనారాయణ అని.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోంది. మండలి విషయాన్ని తాను డీల్ చేస్తానని.. బిల్లు పాస్ చేయించి తీసుకు వస్తానని.. పాస్ చేయించకపోయినా… రిజెక్ట్ చేసి అయినా..బిల్లును తీసుకువస్తామని..జగన్మోహన్ రెడ్డికి.. మంత్రి బొత్స సత్యనారాయణ గట్టి హామీ ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. చివరికి ఈ ఎపిసోడ్‌లోఆయన పూర్తిగా విఫలమయ్యారు. దీంతో.. జగన్మోహన్ రెడ్డి ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారని కూడా వైసీపీ ఆఫీసులో ప్రచారం జరుగుతోంది. ఈ ఫ్రస్ట్రేషనే.. బొత్సా సత్యనారాయణ రెండు రోజుల పాటు..అందరిపై చూపించారంటున్నారు. నిజానికి శాసనమండలి వ్యవహారాన్ని బొత్స.. మొదటి నుంచి చూసుకున్నారు. మండలి ఛైర్మన్ షరీఫ్‌పై తన రేంజ్‌కు తగ్గట్లుగా.. తన వ్యూహాలతో ఒత్తిడికి గురి చేశారు. అందు కోసం.. చాలా పనులే చేశారు. ఇక అంతా పనైపోయింది.

సెలక్ట్ కమిటీకి పంపకుండా.. నిర్ణయం జరిగిపోయిందని… బయటకు లీక్ చేశారు. మీడియా వర్గాలకూ అదే సమాచారం అందింది. సెలక్ట్ కమిటీకి బిల్లులను పంపకుండా.. ఓటింగ్ పెడతారని.. దాంతో.. మళ్లీ అసెంబ్లీకి వెళ్తుందని.. అక్కడ పని పూర్తయిపోతుందని.. ప్రభుత్వం అనుకుంది. శాసనమండలి చైర్మన్ కూడా.. తన నిర్ణయాన్ని దాదాపుగా అదే రీతిలో చదివారు. టీడీపీ సరైనసమయంలో నోటీసులు ఇవ్వలేదని.. అందులో ఉంది. కానీ.. చివరి వాక్యంలో మాత్రం… తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి.. సెలక్ట్ కమిటీకి పంపుతున్నట్లుగా చైర్మన్ ప్రకటించారు. ఈ వాక్యాన్ని ఊహించలేకపోయిన బొత్స సత్యనారాయణ బిత్తరపోయారు. తాను పని అయిపోయిందనుకుంటే… ఇలా తలకిందులు చేశారన్న ఉద్దేశంతోనే.. ఆయన షరీఫ్ పై ఊగిపోయారంటున్నారు. అనుచితమైన వ్యాఖ్యలు చేసి.. కంట్రోల్ తప్పిపోయారంటున్నారు.

రెండో రోజు కూడా.. ఆయన షరీఫ్ పై ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఎంత చేసినా.. బొత్స విఫలం కావడంతో..జగన్ వద్ద రిమార్కులు పడిపోయాయని.. ఈ దెబ్బతో.. బొత్స హర్టయ్యారని చెబుతున్నారు. ఆయనను నమ్ముకున్న జగన్ కూడా.. అసహనానికి గురయ్యారని.. ఇక ఆ తర్వాత నుంచి.. బొత్సకు రాజధాని అంశాలపై జరుగుతున్న సమావేశాలకు పిలుపు రావడం లేదని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కవిత బెయిల్ పిటిషన్ పై నేడే తీర్పు..

లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై సోమవారం తీర్పు వెలువరించనుంది రౌస్ అవెన్యూ కోర్టు. ఈ కేసులో తనను ఈడీ, సీబీఐలు అక్రమంగా అరెస్ట్ చేశాయని, తనకు బెయిల్...

నేడు ఏపీలో ప్రధాని పర్యటన..వైసీపీని టార్గెట్ చేస్తారా.?

సోమవారం ఏపీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.అనకాపల్లిలో బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ కు మద్దతుగా బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. సాయంత్రం 5 : 30 గంటలకు...

ఓటేస్తున్నారా ? : మీ పిల్లలు బానిసలుగా బతకాలనుకుంటున్నారా ?

ఊరంటే ఉపాధి అవకాశాల గని కావాలి. మనం ఊళ్లో బతకాలంటే పనులు ఉండాలి. ఆ పనులు స్థాయిని బట్టి రియల్ ఎస్టేట్ పనుల దగ్గర నుంచి సాఫ్ట్...

తెలంగాణ మోడల్…బీజేపీ, బీఆర్ఎస్ కు రాహుల్ అస్త్రం ఇచ్చారా..?

కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశమంతా తెలంగాణ మోడల్ ను అమలు చేస్తామని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటన చర్చనీయాంశం అవుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి ఆరు నెలలే అవుతున్నా అప్పుడే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close