అమరావతిలో గత ప్రభుత్వం కట్టిన పేదల ఇళ్లు రెడీ

రెడీగా ఉన్న ఇళ్లు ఇవ్వరు కానీ సీడ్ క్యాపిటల్ భూములు పంచుతారా..? … ఇదీ అమరావతిలో భూసమీకరణ చేసిన భూముల్లో రెండు వేలకుపైగా ఎకరాలను .. ఓటు బ్యాంక్‌కు ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేయాలన్న ప్రభుత్వ ఆలోచన బయటకు వచ్చిన తర్వాత అందరిలోనూ మదిలిన ప్రశ్న. ఎందుకంటే.. అమరావతిలో గత ప్రభుత్వం.. ఇళ్లు లేని పేదల కోసం… ఇళ్లు కట్టించింది. అవి పూర్తయ్యాయి. అలాట్‌మెంట్ కూడా అయిపోయింది. స్వాధీన పర్చడమే మిగిలింది. కానీ ఎనిమిది నెలలుగా.. ఆ ఇళ్ల జోలికి ప్రభుత్వం వెళ్లడం లేదు. ఎవర్నీ వెళ్లనీయడం లేదు.

రాజధాని ఏరియాగా 29 గ్రామాలను గుర్తించిన తర్వాత.. అక్కడి సామాజిక పరిస్థితులను.. ప్రభుత్వం అధ్యయనం చేయించింది. రైతు కూలీలకు ఉపాధి, ఇళ్లు లేని పేదలు.. తీవ్రంగా ప్రభావితమవుతారని అంచనా వేసింది. వీరిని ఆదుకోవడానికి సామాజిక పెన్షన్లు మంజూరు చేసింది. అలాగే.. ఇళ్లు కూడా.. కట్టించాలని నిర్ణయించింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉద్యోగుల ఇళ్లతో పాటు.. పేదల ఇళ్లను కూడా శరవేగంగా నిర్మించింది. 29 గ్రామాల్లో.. 7876 మంది ఇళ్లు లేని కుటుంబాలు ఉన్నాయని గుర్తించి .. రూ.650 కోట్ల వ్యయంతో సకల సౌకర్యాలతో ఇళ్ళ నిర్మాణం చేశారు. మొదటి విడతగా 8 చోట్ల మొత్తం 44 ఎకరాల్లో 157 బ్లాకుల్లో 5,024 ఫ్లాట్లు నిర్మించారు. భవన నిర్మాణాల కోసం రూ.296 కోట్లు , మౌలిక సదుపాయాల కోసం రూ. 49 కోట్లు ఖర్చు చేశారు. ఎన్నికలకు ముందు ప్రభుత్వం వారికి ఫ్లాట్లను ఎలాట్ చేసింది. ఫినిషింగ్ వర్క్ పూర్తి చేసి వారికి అందించాల్సి ఉంది. మరో నెలలో ఆ వర్క్ పూర్తయిపోతుదంనే సమయంలో ప్రభుత్వం మారింది. అప్పట్నుంచి అవి నిరుపయోగంగా మారిపోయాయి. అన్నింటితో పాటు.. వాటినీ కూడా ప్రభుత్వం నిలిపివేసింది.

ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా పేదలకు.. రాజధాని భూముల్లోనే ఇళ్ల స్థలాలు ఇస్తామనే ప్రకటన చేసింది. రెడీగా ఉన్న ఇళ్లను ఇస్తే చాలని.. పేదలు అనుకొంటూండగా.. కొత్తగా స్థలాలు ఇస్తామని ప్రభుత్వం ఆశ పెట్టడం వెనుక దురుద్దేశం ఉందన్న భావన రాజధాని రైతుల్లో వ్యక్తమవుతోంది. ఇళ్ల స్థలాలు వస్తాయని పేదలను ఆశ పెట్టి.. ఉద్యమం చేస్తున్న రైతులపైకి ఉసిగొల్పేందుకే ప్రభుత్వం… ఈ ఇళ్ల స్థలాల పంపిణీ వ్యవహారం తెరపైకి తెచ్చిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతుల ఉద్యమాన్ని నీరు గార్చడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో ఇదీ కూడా ఒకటని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close