ఎమ్మెల్సీలయిన ఇద్దరు మంత్రులు రాజీనామా..?

శాసనమండలి రద్దు తీర్మానం ఆమోదించిన వెంటనే.. జగన్మోహన్ రెడ్డి .. నైతిక పరంగా విమర్శలు రాకుండా ఉండటానికి.. ఇద్దరు మంత్రులతో రాజీనామా చేయించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం మంత్రివర్గంలో.. పిల్లిసుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ ఎమ్మెల్సీలు. వీరికి గత ఎన్నికల్లో.. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ టిక్కెట్లు ఇచ్చినప్పటికీ.. విజయం సాధించలేకపోయారు. అయినప్పటికీ.. వెన్నంటే ఉన్నారన్న కారణంగా.. మంత్రి పదవులను జగన్ ఇచ్చారు. వీరిలో సుభాష్ చంద్రబోస్.. ముందు నుంచీ ఎమ్మెల్సీగా ఉన్నారు. మోపిదేవిని.. మంత్రి పదవి అప్పగించిన తర్వాత శాసనమండలికి పంపించారు. ఎనిమిది నెలల కాలంలోనే వీరి మంత్రి పదవులకు గండం వచ్చి పడింది. నిజానికి శాసనమండలి అధికారికంగా రద్దయ్యే వరకూ.. వీరు మంత్రి పదవుల్లో కొనసాగడానికి అవకాశం ఉంది.

అసెంబ్లీ తీర్మానాన్ని లోక్‌సభ, రాజ్యసభలు ఆమోదించి.. రాష్ట్రపతి నోటిఫికేషన్ ఆమోద ముద్ర వేసే వరకూ.. మండలి ఉనికిలో ఉంటుంది. కానీ స్వయంగా.. ప్రభుత్వమే.. మండలిని రద్దు చేయాలని తీర్మానం చేసిన తర్వాత.. ఆ మండలిలో సభ్యులను మంత్రులుగా కొనసాగించడం కరెక్ట్ కాదని.. జగన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీలో ..తీర్మానం ఆమోదించిన వెంటనే.. మంత్రులు రాజీనామా చేయాలని.. జగన్.. మంత్రివర్గ సమావేశంలో సూచించినట్లుగా చెబుతున్నారు. ఈ మేరకు వారు రాజీనామా చేయడం లాంఛనమే. మండలి రద్దును తాము స్వాగతిస్తున్నామంమటూ.. మంత్రులు స్వయంగా మండలిలో ప్రకటించారు కూడా.

అధికారికంగా ఈ విషయం బయటకు తెలియకపోయినప్పటికీ.. టీడీపీ నేత నారా లోకేష్ మాత్రం.. మండలిని రద్దు చేయాలని నిర్ణయించుకున్నందున.. మంత్రులతో పాటు.. మండలిలో ఉన్న వైసీపీ ఎమ్మెల్సీలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. మండలి రద్దయ్యేలోపు జరగబోయే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనకూడదని.. డిమాండ్ చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close