పవన్ డిమాండ్‌ను అంగీకరించిన సీఎం.. !

కర్నూలు జిల్లాలో సుగాలి ప్రీతి అనే విద్యార్థిని హత్య ఉదంతంపై పవన్ కల్యాణ్ చేస్తున్న పోరాటానికి ప్రతిఫలం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. మంగళవారం ముఖ్యమంత్రి కర్నూలు పర్యటనకు రావడంతో.. వైసీపీ నేతలు, అధికారులు.. సుగాలి ప్రీతి తల్లిని.. ఆయన వద్దకు తీసుకెళ్లారు. కంటివెలుగు కార్యక్రమం ప్రారంభోత్సవం తర్వాత జగన్మోహన్ రెడ్డిని కలిసిన సుగాలి ప్రీతి తల్లి… తన కుమార్తెకు న్యాయం చేయాలని కోరారు. దీనికి స్పందించిన జగన్మోహన్ రెడ్డి… ఆ కేసును సీబీఐకి ఇస్తున్నామని .. భరోసా ఇచ్చారు. న్యాయచేస్తామని ధైర్యం చెప్పారు.

తెలుగుదేశం ప్రభుత్వం హయంలో.. 2017లో జరిగిన సుగాలి ప్రీతి హత్య కేసులో చాలా కీలక మలుపులు చోటుచేసుకున్నాయి. పోలీసుల దర్యాప్తు తీరుపై అనేక అనుమానాలు తలెత్తాయి. అప్పట్లో పాలక పక్షం కానీ.. ప్రతిపక్షం కానీ.. ఈ కుటుంబానికి న్యాయం చేయడానికి .. పోరాటం చేయడానికి ముందుకు రాలేదు. ఆలస్యంగా తన దృష్టికి వచ్చినప్పటికీ పవన్ కల్యాణ్.. సుగాలి ప్రీతి కుటుంబం కోసం… పోరాడాలని నిర్ణయించుకున్నారు. గతంలోనే.. ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టిన ఆయన స్పందించకపోవడంతో.. కర్నూలులో భారీ ర్యాలీ నిర్వహించి.. సీబీఐ విచారణ జరిపించే వరకూ పోరాడతామని స్పష్టం చేశారు. వైసీపీ మద్దతుదారులైన కొంత మంది .. పవన్ కల్యాణ్ పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో… నిందితులకు వైసీపీ కొమ్ము కాస్తోందన్న ఆరోపణలు బాధితుల వైపు నుంచి వచ్చాయి.

అదే సమయంలో.. మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. అత్యాచారం, హత్య జరిగింది టీడీపీ హయాంలో కదా..అని తేలిగ్గా మాట్లాడిన వ్యవహారం కూడా.. సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారం పెరిగి పెద్దదయితే.. దిశ లాంటి చట్టాలు తీసుకొచ్చి మహిళల భద్రత కోసం..కృషి చేస్తున్న తమకు ఇబ్బందికరమన్న ఉద్దేశంతో… సీబీఐకి ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు సుగాలి ప్రీతి కుటుంబానికి హామీ ఇచ్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్ట్ – ఈ మోసాన్ని ఎవరూ ఊహించలేరు !

వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా...

కేసీఆర్ రూ. కోటి ఇచ్చినా … మొగులయ్య కూలీగా ఎందుకు మారారు?

కిన్నెర కళాకారులు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారంటూ ఓ చిన్న వీడియో, ఫోటోలతో కొంత మంది చేసిన పోస్టులతో రాజకీయం రాజుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close