క‌ల్యాణ్‌కి ఎన్టీఆర్ స‌ర్దుబాటు

ఎన్టీఆర్ ఆర్ట్స్‌లో ఎన్టీఆర్‌తో ఓ సినిమా తీశాడు క‌ల్యాణ్ రామ్‌. అదే… ‘జై ల‌వ‌కుశ‌’. ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభిన‌యం చేసిన ఈ చిత్రం బాక్సాఫీసు ద‌గ్గ‌ర మంచి విజ‌యాన్ని అందుకుంది. క‌ల్యాణ్ రామ్‌కి లాభాలు తెచ్చిపెట్టింది. ఆ త‌ర‌వాత మ‌ళ్లీ ఎన్టీఆర్ తో ఓ సినిమా తీయాల‌ని, ఈసారి వ‌చ్చిన లాభాల్లో త‌మ్ముడికి 50 శాతం వాటా ఇవ్వాల‌ని క‌ల్యాణ్ రామ్ భావించాడు. అందుకోసం క‌థ‌ల్ని కూడా వెదికే ప‌నిలో ప‌డ్డాడు. అయితే అనూహ్యంగా ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ కాంబోలో వ‌చ్చే సినిమాకి క‌ల్యాణ్ రామ్ భాగ‌స్వామిగా చేరిపోయాడు. సోలోగా సినిమా తీయ‌డం కంటే, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చే సినిమాకి భాగ‌స్వామిగా ఉండ‌డం క‌ల్యాణ్ రామ్‌కి బెట‌ర్ ఆప్ష‌నే. పైగా.. ఇప్పుడు ఎన్టీఆర్ వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్నాడు. బ‌డా ద‌ర్శ‌కులు ఎన్టీఆర్‌తో సినిమాలు చేయ‌డానికి క‌థ‌లు సిద్ధం చేస్తున్నారు. ఈద‌శ‌లో క‌ల్యాణ్ రామ్ బ్యాన‌ర్‌కీ ఓ స్లాట్ చూడ‌డం క‌ష్ట‌మైపోతోంది. అందుకే ఇలా ‘పార్ట‌న‌ర్‌షిప్‌’ ప్లాన్ చేశాడు ఎన్టీఆర్‌. పైగా తాజా చిత్రంలో ఎన్టీఆర్‌కి సైతం వాటా ఉన్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. పారితోషికం బ‌దులుగా లాభాల్లో వాటా తీసుకోవ‌డానికి ఎన్టీఆర్ మొగ్గు చూపిస్తున్నాడ‌ట‌. అంటే.. ఓర‌కంగా ఎన్టీఆర్ కూడా నిర్మాతే. అందుకే అన్న‌య్య బ్యాన‌ర్‌ని రంగంలోకి దించాడు. ఇక మీద‌ట ఎన్టీఆర్ సినిమాల్లో ‘ఎన్టీఆర్ ఆర్ట్స్‌’ వాటా పొందితే… అంత‌గా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌న్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈవెంట్ కంపెనీ నిర్వాకం.. నిర్మాత‌ల‌కు త‌ల‌నొప్పులు

ఇండియాలోనే నెంబ‌ర్ వ‌న్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ అని చెప్పుకొనే ఓ సంస్థ చేసిన నిర్వాకం వ‌ల్ల‌, నిర్మాత‌ల‌కు త‌ల‌నొప్పులు మొద‌ల‌య్యాయి. పోలీస్ స్టేష‌న్ మెట్లు ఎక్కాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. అస‌లు మేట‌ర్...

క్రిష్ పేరు మిస్సింగ్‌.. ఏం జ‌రిగింది?

హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు టీజ‌ర్ వ‌చ్చింది. ప‌వ‌న్ ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. ఈ సినిమాని రెండు భాగాలుగా విడుద‌ల చేస్తామ‌ని చిత్ర బృందం ప్ర‌క‌టించింది. అది కూడా ఓకే. అయితే షాకింగ్ ఏమిటంటే......

పాయకరావుపేట రివ్యూ : వంగలపూడి అనితకు కలిసొస్తున్న కాలం !

తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ లీడర్లలో ఒకరు తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత. ఈ ఐదేళ్లలో టీడీపీ మహిళా నేతలు మానసిక వేధింపులు భయంకరంగా ఎదుర్కొన్నారు. వైసీపీ నేతల బూతులు,...

చైతన్య : ప్రభుత్వం శాశ్వతం.. సీఎం కాదు – ఇంగితం లేదా నాగేశ్వర్ !

ఎంత మేధావులమని చెప్పుకున్నా తాత్కాలిక లాభాలో తాము వ్యతిరేకించే వారిని గట్టిగా వ్యతిరేకించాలన్న కురచబుద్దితో వారి ప్రత్యర్థుల్ని సపోర్టు చేసి నవ్వుల పాలవుతూంటారు. ఆ జాబితాలో చాలా కాలంగా ప్రొ.నాగేశ్వర్ కూడా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close