అధిష్టానంపై అసంత్రప్తులను చేరదీయండి

భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బలపడేందుకు తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. క్షేత్రస్ధాయిలో పార్టీ పటిష్టానికి చర్యలు తీసుకోవాలని పార్టీ తెలంగాణ నాయకత్వానికి స్పష్టం చేసింది. ఢిల్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఇతర రాష్ట్రాలపై ద్రష్టి పెట్టిన భారతీయ జనతా పార్టీ తెలంగాణపై మరింత శ్రద్ధ పెట్టాలని స్థానిక నాయకులను తేల్చిచెప్పింది. ఇందులో భాగంగా అధికార తెలంగాణ రాష్ట్ర సమితిలో అసంత్రప్తితో ఉన్న నాయకులను చేరదీయాలని దిశానిర్దేశం చేసినట్లు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇప్పటికే అనేక మంది పార్టీ అధిష్టానంపై కినుక వహించారు. శాసనసభ ఎన్నికల్లో టిక్కట్లు ఆశించిన వారికి పార్టీ అధిష్టానం అనేక తాయిలాలను ఆశ చూపించింది. పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయినా ఇంకా ఎవరికి ఎలాంటి పదవులు ఇవ్వలేదు. తెలంగాణలో అనేక నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. వీటి భర్తీ ద్వారా పార్టీలో సీనియర్లను సంత్రప్తి పరుస్తారని ఆశించారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం నామినేటెడ్ పదవుల భర్తీని దాదాపుగా గాలికి వదిలేశారు. ఈ దశలో చాలమంది సీనియర్లు పార్టీ పట్ల విముఖంగా ఉన్నారు. అలాంటి వారిని పార్టీలోకి ఆహ్వనించాలని, వారికి కేంద్రమే నామినేటెడ్ పదవులు ఇస్తుందని ఎర వేసి వారిని లాగేయాలని బీజేపీ అధినాయకత్వం తెలంగాణ స్థానిక నాయకులకు సూచించినట్లు చెబుతున్నారు. ఈ పనిని ఎంత త్వరగా ప్రారంభిస్తే అంత త్వరగా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టవచ్చేనన్నది బీజేపీ అధిష్టానం ఆలోచనగా చెబుతున్నారు. రానున్న మూడున్నరేళ్లలో ప్రభుత్వానికి వ్యతిరేకంటా పోరాటాలు చేయడంతో పాటు పార్టీని క్షేత్ర స్థాయిలోకి తీసుకువెళ్లాలంటే అధికార అసంత్రప్తులను చేరదీయడం ఒక్కటే మార్గమని స్థానిక నాయకులకు దిశానిర్దేశం చేసినట్లు చెబుతున్నారు. ఇలా చేయగలిగిన వారికే పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టాలన్నది బీజేపీ అధిష్టానం ఆలోచనగా చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాష్ బ్యాక్‌: వేసేది దేవుడి వేషం.. నోట్లో సిగ‌రెట్!

పాత్ర కోసం ప్రాణాలిచ్చేస్తాం అని కొంత‌మంది చెబుతుంటారు. అది మ‌రీ అతిశ‌యోక్తి కానీ, కొన్ని పాత్ర‌లు చేసేట‌ప్పుడు నిష్ట‌గా నియ‌మంగా ఉండ‌డం మాత్రం స‌ర్వ సాధార‌ణంగా క‌నిపించే వ్య‌వ‌హార‌మే. ముఖ్యంగా దేవుడి పాత్ర‌లు...

బెయిల్ షరతులు ఉల్లంఘించిన పిన్నెల్లి

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ షరతులు మొదట్లోనే ఉల్లంఘించారు. ఆరో తేదీ వరకూ ఆయన నర్సరావుపేటలో మాత్రమే ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది . అయితే ఆయన నర్సరావుపేటకు చేరుకున్నట్లు కానీ...

జవహర్ రెడ్డి చక్కబెడుతున్న భూములెన్ని !?

సీఎస్ జవహర్ రెడ్డి వ్యవహారం ఏపీలో ఎన్నో సంచలనాలకు కారణం అవుతోంది . కొత్త ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే ఆయన రిటైర్ కాబోతున్నారు. ఈ లోపు ఆయన వ్యవహారాలు...

ఇప్పుడు ఏపీ మద్యం దుకాణాల్లో నో క్యాష్ పాలసీ !

నిన్నామొన్నటిదాకా క్యాష్ తప్ప మరో డిజటల్ పేమెంట్ తీసుకోలేదు ఏపీ మద్యం దుకాణాల్లో. ఇప్పుడు పాలసీ ఒక్క సారిగా మారిపోయింది. శుక్రవారం నుంచి ప్రభుత్వం పాలసీ మార్చేసింది. డిజిటల్ పేమెంట్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close