మందడంలోనూ భూములన్నీ ఇళ్ల స్థలాలకే ..!

రాజధానికి రైతులు ఇచ్చిన 35వేల ఎకరాల భూముల్లో రైతులకు ఇవ్వాల్సినవి ఇచ్చి… రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలకు.. పోను.. ప్రభుత్వానికి ఏడెనిమిది వేల ఎకరాలు మిగులుతాయని.. వాటిలో ప్రపంచ స్థాయి నిర్మాణాలు చేపట్టి ..రెండు లక్షల లక్షల కోట్ల ఆదాయం సంపాదిస్తామని.. గత ప్రభుత్వం లెక్కలేసింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం మరింత భిన్నంగా ఆలోచించింది. ఆ స్థలాలను.. ఇళ్ల స్థలాల కింద పంపిణీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంది. నిన్నామొన్నటి దాకా నాలుగు వందల ఎకరాలు ఇందు కోసం గుర్తించారని అనుకున్నారు కానీ.. ఇప్పుడది.. 1251 ఎకరాలకు చేరింది.

ఈ ఇళ్ల స్థలాల పంపిణీకి సీఆర్డీఏ చట్టంలోని సెక్షన్ 53(డి)ని ప్రభుత్వం ఉపయోగించుకుంటోంది. ఈ చట్టం ప్రకారం భూ సమీకరణ కింద సేకరించిన భూమిలో 5 శాతం పేదలకు గృహ వసతి కల్పించేందుకు ఇవ్వాలని పేర్కొందని జీవోలో ప్రభుత్వం చెబుతోంది. ఉగాది రోజున రాజధాని పరిధిలో ల్యాండ్ పూలింగ్ కు ఇచ్చిన భూముల్లో 1251 ఎకరాలను ఒక్కో సెంటు చొప్పున.. గుంటూరు , కృష్ణా జిల్లాల్లో లబ్దిదారులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం జీవో జారీ చేసేసింది. మొత్తం 54వేల మంది లబ్దిదారులకు భూములు పంచనున్నారు.

తాము రాజధాని నిర్మించడానికి ఇచ్చిన భూమిని ఇళ్ల స్థలాల పేరుతో పంచడం రాజ్యాంగ విరుద్ధమని రైతులు ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ ఇంకా విచారణలో ఉండగానే.. ప్రభుత్వం జీవోలు ఇచ్చేస్తోంది. రాజధాని గ్రామాల్లో వేరే జిల్లాల వారికి భూములు కేటాయించడం.. అదీ కూడా.. రాజధాని గ్రామాల్లో ఇవ్వడం వివాదాస్పదమవుతోంది. గత ప్రభుత్వం రాజధాని గ్రామాల్లో పేదల కోసం అన్ని సౌకర్యాలతో.. ఇళ్లను నిర్మించింది. కానీ.. వాటిని ప్రభుత్వం పంపిణీ చేయకుండా నిలిపేసింది. ఇప్పుడు వారికి ఆ ఇళ్లను కాకుండా స్థలాలను ఇస్తామని చెబుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

య‌శ్ స‌ర‌స‌న న‌య‌న‌తార‌

'కేజీఎఫ్`తో య‌శ్ పాన్ ఇండియా హీరో అయిపోయాడు. 'కేజీఎఫ్‌' త‌ర‌వాత య‌శ్ ఎలాంటి సినిమా చేయ‌బోతున్నాడా? అని దేశ‌మంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తోంది. ఈ నేప‌థ్యంలో గీతు మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌డానికి...

శింగనమల రివ్యూ : కాంగ్రెస్ రేసులో ఉన్న ఒకే ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం !

అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం అందర్నీ ఆకర్షిస్తోంది. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ రేసులో ఉందని చెప్పుకుంటున్న ఒకే ఒక్క నియోజకవర్గం శింగనమల. మాజీ మంత్రి శైలజానాథ్ గతంలో...

ఫోటోలు – టీడీపీ మేనిఫెస్టోలో వైసీపీకి కనిపిస్తున్న లోపాలు !

వైసీపీ మేనిఫెస్టోపై ప్రజల్లో జరుగుతున్న చర్చ జీరో. ఆ పార్టీ నేతలు కూడా మాట్లాడుకోవడం లేదు. కానీ టీడీపీ మేనిపెస్టోపై టీడీపీ నేతలు ప్రత్యేకమైన ప్రణాళికలతో ప్రచార కార్యక్రమం పెట్టుకున్నారు. అదే...

టార్గెట్ పవన్ కళ్యాణ్ …పొన్నూరులో వైసీపీ అభ్యర్థి దౌర్జన్యం

ఏపీలో టీడీపీ సారధ్యంలోని కూటమిదే అధికారమని సర్వేలన్నీ స్పష్టం చేస్తుండటంతో వైసీపీ నేతల్లో ఫ్రస్టేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రబాబును అడ్డుకుంటే అది వైసీపీకి డ్యామేజ్ చేస్తుందని భావించి పవన్ ను వరుసగా టార్గెట్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close