దేవినేని వర్సెస్ వసంత..! మిస్టరీ మరణాల గుట్టు విప్పేస్తారా..?

రాజకీయాల్లో గీత దాటితే అంతే. పాత విషయాలు కొత్తగా బయటకు వస్తాయి. కృష్ణా జిల్లా మైలవరంలో.. టీడీపీ, వైసీపీ నేతల మధ్య వివాదం వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు వరకూ వెళ్తోంది. మైలవరంలో టీడీపీ తరపున దేవినేని ఉమ, వైసీపీ తరపున వసంత కృష్ణప్రసాద్ పోటీ చేశారు. వసంత కృష్ణప్రసాద్ గెలిచారు. దేవినేని ఉమ ఓడిపోయారు. అప్పట్నుంచి… నియోజకవర్గంలో పరిస్థితి ఉప్పు – నిప్పులా ఉంది. రాజధానిగా అమరావతిని మారిస్తే.. రాజీనామా చేస్తానన్న కృష్ణప్రసాద్.. యూటర్న్ తీసుకున్నారు. దాంతో దేవినేని ఉమ.. రాజధాని ఉద్యమాన్ని తన నియోజకవర్గంలో ఓ రేంజ్‌లో నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో.. మూడు రాజధానులకు మద్దతుగా.. వసంత కృష్ణప్రసాద్ తండ్రి మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.

దీంతో దేవినేని ఉమ తీవ్రమైన విమర్శలు చేశారు. ప్రజల్ని అప్పుడు తండ్రి.. ఇప్పుడు కొడుకు వంచించారని.. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే… మోసం చేస్తున్నారని.. ఉమ మండిపడ్డారు. వారిని ప్రజలు.. ఎలాంటి కార్యక్రమాలకూ పిలవొద్దన్నారు. దీనిపై వసంత నాగేశ్వరరావు కూడా ఘాటుగా స్పందించారు. దేవినేని ఉమపై వ్యక్తిగత విమర్శలు చేశారు. ఇంతటితో దేవినేని ఉమ వదిలి పెట్టలేదు..మళ్లీ ప్రెస్‌మీట్ పెట్టి.. కొత్త ఆరోపణలు చేశారు. కొత్త కొత్త క్యారెక్టర్లను తీసుకొచ్చారు. బినామీ ఆస్తుల కోసమే పొదిలి రవిని వసంత నాగేశ్వరరావు చంపారని.. హైదరాబాద్‌లోని మీ ఇంట్లో బాపట్ల మేరీ చనిపోయింది వాస్తవం కాదా అని రెండు కొత్త క్యారెక్టర్లను తీసుకొచ్చారు. దీంతో ఉలిక్కిపడిన వసంత నాగేశ్వరరావు.. వెంటనే మీడియాకు పిలిచి.. కొత్త సవాల్ విసిరారు.

బాపట్ల మేరీ చనిపోయిన రోజు కృష్ణప్రసాద్ హైదరాబాద్‌లో ఉన్నాడని రుజువు చేస్తే నేను తల తీసుకుంటా లేదంటే నువ్వు తల తీసుకుంటావా అని సవాల్ చేశారు. దేవినేని ఉమ విమర్శలను వెనక్కు తీసుకోకుంటే తాట వలుస్తానని హెచ్చరించారు. అంతటితో వదిలి పెట్టలేదు… వదినను చంపిన దేవినేని ఉమకు సవాల్ చేయాలంటే సిగ్గుగా ఉందన్నారు. ఇప్పుడు అందరికీ.. పొదిలి రవి, బాపట్ల మేరీ, ఉమ వదిన మృతి మిస్టరీలుగా కనిపిస్తున్నాయి. రాజకీయాల్లోకి వ్యక్తిగత విషయాలను తీసుకొస్తే.. కుటుంబాలు రోడ్డున పడతాయన్న విషయాన్ని నేతలిద్దరూ మర్చిపోయారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close