ప్ర‌భాస్ సినిమా.. ఓ చంద‌మామ క‌థ‌!

`బాహుబ‌లి`ని టార్గెట్ చేసి సినిమా తీయాల‌న్న సాహ‌సం కూడా ఎవ‌రూ చేయ‌ని రోజులివి. నాన్ బాహుబ‌లి రికార్డుల్ని చూసి మురిసిపోవ‌డం త‌ప్ప‌, బాహుబ‌లి ద‌రిదాపుల్లోకి వెళ్లాల‌న్న ఆలోచ‌న కూడా ఎవ‌రికీ రావ‌డం లేదు. అయితే… నాగ అశ్విన్ మాత్రం ఏకంగా `బాహుబ‌లి`కే గురిపెట్టాడు. ప్ర‌భాస్ – నాగ అశ్విన్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. బుధ‌వార‌మే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. ఈ కాంబో గురించిన కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల్ని రాబ‌ట్టే ప్ర‌య‌త్నం చేసింది తెలుగు 360.

ఇదో జాన‌ప‌ద క‌థా చిత్ర‌మ‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. మాయ‌లూ, మంత్రాలూ… త‌ర‌హా క‌థ ఇది. ఒక్క మాట‌లో చెప్పాలంటే ఓ చంద‌మామ క‌థ‌లా ఉండ‌బోతోంది. మ‌హాన‌టి పూర్తయ్యాక `పాతాళ భైర‌వి`లాంటి సినిమా తీయాల‌ని వుంద‌ని నాగ అశ్విన్ చెప్పుకొచ్చాడు. అలాంటి క‌థ‌లో చిరంజీవి న‌టిస్తే బాగుంటుంద‌న్న ఆలోచ‌న‌ని అశ్వ‌నీద‌త్ వ్య‌క్త‌ప‌రిచారు. అక్క‌డే ఈ సినిమా క‌థ‌కు బీజం ప‌డింది. అప్ప‌టి నుంచీ ఈ క‌థ‌పై నాగ అశ్విన్ క‌స‌ర‌త్తు చేయ‌డం మొదలెట్టారు. ఆ క‌థ కార్య‌రూపం దాలుస్తూ.. దాలుస్తూ… ఇప్పుడు పూర్తి స్థాయి స్క్రిప్టుగా మారింది. తీరా చూస్తే… ఈ క‌థ ప్ర‌భాస్‌కి బాగా న‌ప్పుతుంద‌న్న భావ‌న క‌లిగింది. ఆ క‌థ‌ని ఆమ‌ధ్య చూచాయిగా.. ప్ర‌భాస్‌కి వినిపించ‌డం, తొలి సిట్టింగ్‌లోనే ప్ర‌భాస్ ఓకే చెప్పేయ‌డం జ‌రిగిపోయాయి. ఈ సినిమా కోసం దాదాపు 200 కోట్ల బ‌డ్జెట్ అవుతుంద‌ని సమాచారం. అశ్వ‌నీద‌త్ ఓ బాలీవుడ్ నిర్మాణ సంస్థ‌తో చేతులు క‌లిపే ఉద్దేశం ఉంద‌ని తెలుస్తోంది. మొత్తానికి టాలీవుడ్ నుంచి మ‌రో పాన్ ఇండియా సినిమా రాబోతోంది. తారాగ‌ణం, ఇత‌ర న‌టీన‌టులు ఇత‌ర భాష‌ల్లోంచి దిగుమ‌తి చేసే ప‌నిలో ఉంది చిత్ర‌బృందం. ఈ సినిమాలో చాలా చాలా ప్ర‌త్యేక‌తలు క‌నిపించ‌బోతున్నాయి. అవి ఒకొక్క‌టిగా వైజ‌యంతీ మూవీస్ రివీల్ చేయ‌బోతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గ్రేట్ క్లాసిక్‌: 50 ఏళ్ల ‘అల్లూరి సీతారామ‌రాజు’

కొన్ని పాత్ర‌లు కొంద‌రి కోసం త‌యారు చేయ‌బ‌డ‌తాయి. మ‌రొక‌రు వాటి జోలికి వెళ్ల‌లేరు. మ‌రొక‌ర్ని ఆ పాత్ర‌లో ఊహించుకోలేం కూడా. అలాంటి గొప్ప పాత్ర 'అల్లూరి సీతారామ‌రాజు'. ఆ పాత్ర‌లో న‌టించే అపురూప‌మైన‌...

గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి@ రూ.14 కోట్లు

ఓటీటీ మార్కెట్ ప‌డిపోయింద‌ని చాలామంది నిర్మాత‌లు దిగాలు ప‌డిపోతున్నారు. అయితే ఇంత క్లిష్ట‌మైన స్థితిలో కూడా కొన్ని ప్రాజెక్టులు మాత్రం మంచి రేట్లే తెచ్చుకొంటున్నాయి. ఇటీవ‌ల 'తండేల్‌' రూ.40 కోట్ల‌కు అమ్ముడుపోయింది. ఇప్పుడు...

ట్వీట్ వార్ … శశి థరూర్ వర్సెస్ బండి సంజయ్

కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్, బీజేపీ నేత బండి సంజయ్ మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. రామ మందిర నిర్మాణం, మోడీకి ఆదరణ పెంచేలా ఫ్రేమ్ లను సంజయ్ పంపిణీ చేస్తున్నారని...ఇది ఎన్నికల...

కూటమికి బీజేపీ సహకారం ఇంతేనా !?

ఏపీ ఎన్డీఏ కూటమిలో బీజేపీ వ్యవహారం ఎప్పటికప్పుడు చర్చనీయాంశం అవుతోంది. భారతీయ జనతా పార్టీకి ఏపీలో ఆరు లోక్ సభ సీట్లు, పది అసెంబ్లీ సీట్లు కేటాయించారని ప్రకటించినప్పడు రాజకీయవర్గాలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close