మ‌హేష్‌పై ఆశ వ‌దులుకోని వంశీ

స‌రిలేరు నీకెవ్వ‌రు త‌ర‌వాత మ‌హ‌ర్షి కాంబినేష‌న్ రిపీట్ అవ్వాల్సింది. కాని కొన్ని కార‌ణాల వ‌ల్ల‌… ఆ సినిమా ఆగిపోయింది. వంశీ పైడిప‌ల్లి మ‌హేష్ కోసం ఓ క‌థ త‌యారు చేసుకున్నా, అది మ‌హేష్ అంచ‌నాల‌కు త‌గిన‌ట్టుగా రాక‌పోవ‌డంతో ఆ సినిమాని మ‌హేష్ ప‌క్క‌న పెట్టేశాడు. చిరంజీవి 152 వ చిత్రంతో మ‌హేష్ త్వ‌ర‌లోనే బిజీ కాబోతున్నాడు. ప‌ర‌శురామ్‌, అనిల్ రావిపూడి.. ఈ ఇద్ద‌రూ మ‌హేష్ కోసం కొత్త క‌థ‌లు సిద్ధం చేస్తున్నారు.

అయితే… వంశీ మాత్రం మ‌హేష్ సినిమాపై ఆశ‌లు వ‌దులుకోలేదు. `మా కాంబోకి కాస్త బ్రేక్ వ‌చ్చిందంతే. క‌థ కుదురుకోగానే ప‌ట్టాలెక్కుతుంది` అంటూ స‌న్నిహితుల ద‌గ్గ‌ర న‌మ్మ‌కంగా చెబుతున్నాడ‌ట‌. మ‌హేష్ కూడా వంశీతో అదే చెప్పాడ‌ట‌. `మ‌న కాంబోలో సినిమా ఉంది. కానీ కాస్త ఆల‌స్యం అవుతుందంతే`అని ధైర్యం చెప్పాడ‌ట‌. చిరంజీవి 152వ సినిమాలో మ‌హేష్ న‌టించ‌డం నిజ‌మే అయితే.. ఆ సినిమా కోసం త‌ను 30 రోజుల కాల్షీట్లు ఇవ్వాల్సివ‌స్తుంది. ఈలోగా వంశీ స‌రైన క‌థ చెప్ప‌గ‌లిగితే.. ఆ సినిమా ప‌ట్టాలెక్క‌డం ఖాయం. బ‌హుశా… వంశీ ధైర్యం కూడా అదే కావొచ్చు. వంశీ లాంటి ద‌ర్శ‌కుడికి `నో`చెప్ప‌డం మ‌హేష్‌ని కాస్త ఇబ్బంది పెట్టే విష‌య‌మే. ఓ ద‌ర్శ‌కుడిగా కాకుండా, ఓ స్నేహితుడిగా వంశీ మ‌హేష్‌కి ద‌గ్గ‌ర‌య్యాడు. ఈ నేప‌థ్యంలో వంశీకి వెన్నుద‌న్నుగా నిల‌వాల‌నుకుంటున్నాడు మ‌హేష్‌. ఈ చిత్ర‌సీమ‌లో ఏదైనా జ‌ర‌గొచ్చు. ప‌ట్టాలెక్కాల్సిన సినిమా ఆగిపోవొచ్చు. ఆగి పోయిన సినిమా మొద‌ల‌వ్వొచ్చు. వంశీ న‌మ్మ‌కం కూడా అదే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close