కరోనా దాడి చేశాక ఆయుధాలు వెదుక్కుంటున్న తెలుగు రాష్ట్రాలు..!

కరోనా … తెలుగు రాష్ట్రాలను భయాందోళనలకు గురి చేస్తోంది. తుమ్మినా.. దగ్గినా… ప్రతి ఒక్కరూ తమకు కరోనా సోకిందని భయపడుతూ ఆస్పత్రులకు పరుగెత్తాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మంగళవారం హైదరాబాద్‌లో కరోనా పాజిటివ్ కేసు బయటపడిందని తెలిసిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. రాజకీయాలు.. సినిమాలు.. క్రికెట్ అన్నింటినీ కరోనా డామినేట్ చేసింది. ప్రతి సోషల్ మీడియాలోనూ… ప్రత్యక్షంగా కూడా ఎవరు కలిసినా కరోనా గురించే చర్చ. వారి భయాన్ని బుధవారం ఘటనలు మరింతగా భయపెట్టాయి. రహేజా ఐటీ పార్క్‌లో ఓ ఉద్యోగికి కరోనా బయటపడటంతో క్షణాల్లో ఆఫీసులన్నీ ఖాళీ అయిపోయాయి.

టెస్టుల కోసం.. వందల మంది ఉద్యోగులు ఆస్పత్రులకు పరుగెత్తారు. ఇక కరోనా అనుమానితులంటూ.. విజయవాడ, ఏలూరుల్లోనూ.. కొంత మందిని ఐసోలేషన్ రూముల్లో పెట్టారు. కరోనా గురించి భయపడవద్దని ప్రభుత్వం నింపాదిగా చెబుతుంది కానీ… అసలు వచ్చేసిన తర్వాత కూడా.. సరైన రక్షణ చర్యలు తీసుకోలేకపోతున్నారన్న అభిప్రాయం ప్రజల్లో బలపడుతోంది. పొరుగున ఉన్న చైనాలో బయటపడిన తర్వాత ఇండియాలో వ్యాప్తి కాకుండా కరోనా వ్యాప్తిపై దేశ స్థాయిలో… తీసుకున్న రక్షణ చర్యలు అంతంతమాత్రమే. తెలుగు రాష్ట్రాలు అయితే అసలు దృష్టి కూడా పెట్టలేదు. ఇప్పుడు హడావుడిగా ఐసోలేషన్ రూములని.. మెడిసిన్స్ అని హడావుడి చేస్తన్నారు కానీ.. ఇప్పటికే.. కరోనా.. తెలుగు రాష్ట్రాలపై దాడి ప్రారంభించేసింది.

కొద్ది రోజుల క్రితం .. ఇండియాలో కరోనా విజృంభిస్తే తీసుకోవాల్సిన చర్యలపై సన్నద్ధత లేదని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. అలా అన్న కొద్ది రోజులకే.. వైరస్ ఇండియాలో విజృంభిస్తోంది. వైరస్ బాడిన దేశాల్లోని ప్రాంతాల్లో.. ఎంత నిర్మానుష్యం ఉంటుందో.. ఇప్పుడిప్పుడే.. హైదరాబాద్ లో అలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దాహమేసినప్పుడే.. బావి తవ్వుకునే ఆలోచన ఉన్న పాలకుల కారణంగా ఇప్పుడు సామాన్యులు.. కరోనా కు బాధితులకు అవుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మహాసేన రాజేష్‌కు మళ్లీ పవన్‌పై కోపం వచ్చింది !

మహాసేన రాజేష్ రాను రాను కూటమికి సమస్యగా మారుతున్నారు. తాజాగా ఆయన పవన్ కల్యాణ్ విజయం రాష్ట్రానికి ప్రమాదకరం అంటూ ఓ వీడియో చేశారు. అంతగా ఆయనకు ఎందుకు పవన్ పై కోపం...

జాత‌రలో అల్ల‌రోడి ఫైటింగులు!

అల్ల‌రి న‌రేష్‌... ఈమ‌ధ్య ర‌క‌ర‌కాల జోన‌ర్లు ట‌చ్ చేస్తున్నాడు. సోష‌ల్ మెజేజ్ ఉన్న క‌థ‌ల్ని, త‌న‌దైన కామెడీ స్టోరీల్ని స‌మాంత‌రంగా చేసుకొంటూ వెళ్తున్నాడు. మ‌రోవైపు క్యారెక్ట‌ర్ పాత్ర‌ల‌కు న్యాయం చేస్తున్నాడు. ఇప్పుడు యాక్ష‌న్...

ఇంకా బీజేపీకి దగ్గరేనని వైసీపీ చెప్పుకుంటుందా !?

భారతీయ జనతా పార్టీ తమ వ్యతిరేక కూటమిలో చేరి తమ ఓటమిని డిక్లేర్ చేస్తోందని తెలిసిన తర్వాత కూడా వైసీపీ నాయకులు ఇంకా తమకు బీజేపీపై ఎంతో అభిమానం ఉందన్నట్లుగా వ్యవహరిస్తే...

హైద‌రాబాద్ లో భూమి కొన్న మైక్రోసాఫ్ట్…

ప్ర‌ముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ త‌న కార్య‌క‌లాపాల‌ను మ‌రింత విస్తృతం చేయ‌నుంది. ఇప్ప‌టికే హైద‌రాబాద్ స‌హా దేశంలోని ప్ర‌ముఖ న‌గ‌రాల నుండి మైక్రోసాఫ్ట్ ఆఫీసులు ప‌నిచేస్తుండ‌గా, అతిపెద్ద డేటా సెంట‌ర్ ను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close