ఇప్పుడు ఫృధ్వీ గాడ్‌ఫాదర్ జగన్ కాదు.. చిరంజీవి..!

రాజకీయాల్లోకి వెళ్లి రాజకీయానికి బలైపోయిన ధర్టీ ఇయర్స్ ఫృధ్వీ ఇప్పుడు .. రాజకీయం కన్నా.. సినీ రంగమే చాలా బెటర్ అని అనుకుంటున్నారు. ఇక్కడ చిరంజీవి కాకా పట్టేస్తే.. చాలు.. కనీసం బహిరంగంగా పొగిడితే చాలు చాన్సులొస్తాయని.. డిసైడైపోయారు. ఇప్పుడు … చిరంజీవి స్తోత్రం అందుకున్నారు. ఎన్నికల సమయంలో… మెగా క్యాంప్ పై తీవ్రమైన విమర్శలు చేసి… ఆ క్యాంప్ నుంచి అవకాశాలు అందకుండా చేసుకున్న ఆయన ఇప్పుడు… వైసీపీ రాజకీయానికి బలైపోయిన తర్వాత .. మళ్లీ ఆ మెగా క్యాంపే గుర్తుకు వచ్చింది. సైరాలో ఓ చిన్న పాత్ర చేసిన ఫృధ్వీ ఇప్పుడు అవకాశాల కోసం.. చిరంజీవి పొగడటమే పనిగా పెట్టుకున్నారు.

చిరంజీవి లేకపోతే.. తాను ఆత్మహత్య చేసుకునేవాడనని భారీ స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. రాజకీయంగా బలైపోయిన తర్వాత తాను మాన‌సికంగా ఇబ్బందిప‌డ్డాన‌ని, నాకు వేషాలు ఇచ్చి ఎంక‌రేజ్ చేయాల‌ని చిరంజీవి చెప్పారని.. లేకపోతే లేక‌పోతే నేను సూసైడ్ చేసుకునేవాడినని తనని కదిలించిన చిన్నా.. చితకా యూట్యూబ్ చానల్స్ వాళ్లందరికీ చెబుతున్నారు. పదవికి రాజీనామా చేసినప్పుడు.. రేపట్నుంచి ఖాళీ అందర్నీ కడిగి పారేస్తానని ప్రకటించిన ఫృధ్వీ ఆ తర్వాత అడ్రస్ లేరు. పదవి వచ్చిన ఉత్సాహంలో ఇండస్ట్రీ మొత్తాన్ని విమర్శించేశారు. జగన్ సీఎం కావడం.. ఇండస్ట్రీలోని పెద్దలు ఇష్టం లేదని.. అందుకే వచ్చి విష్ చేయలేదని.. కూడా విమర్శలు గుప్పించారు.

అప్పట్లోనే.. ఆయన తీరు తీవ్ర విమర్శల పాలయింది. ఎదిగిన ఇండస్ట్రీనే అవమాన పరుస్తున్నారని అన్నారు. చివరికి రాజకీయం దెబ్బ చాలా వేగంగానే తగిలింది. మళ్లీ ఇప్పుడు ఇండస్ట్రీ శరణు కోరుతున్నారు. దానికి చిరంజీవి ఉపయోగించుకోవాలనుకుంటున్నారు. అంటే.. ఇప్పుడు ఫృధ్వీకి జగన్ కంటే.. చిరంజీవే గొప్పన్నమాట.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మెగా ఫ్యామిలీలో రచ్చ…అల్లు అర్జున్ పై నాగబాబు సీరియస్..!?

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా ప్రచారం చేయడంపై ఇంకా తీవ్ర దుమారం రేగుతోంది. ఇప్పటికే ఆయన పర్యటన...

వ‌ర‌ల్డ్ క‌ప్ ముందు ఇది అవ‌స‌ర‌మా అధ్య‌క్షా..?!

ఏ ఆటైనా మైదానంలో జ‌ట్టు స‌భ్యులంతా స‌మ‌ష్టిగా ఆడితేనే అందం, విజ‌యం. ఒక‌రిపై మ‌రొక‌రు క‌స్సుబుస్సులాడుతుంటే, క‌య్యానికి కాలుదువ్వుతుంటే, అస‌లు జ‌ట్టు స‌భ్యుల మ‌ధ్య స‌యోధ్య లేక‌పోతే - ప్ర‌త్య‌ర్థుల‌పై ఎలా త‌ల‌ప‌డ‌తారు?...

విజ‌య్ స‌ర‌స‌న సాయి ప‌ల్ల‌వి?

టాలీవుడ్ లో ఓ కొత్త కాంబోకి తెర లేవ‌నుందా? విజ‌య్ దేవ‌ర‌కొండ‌, సాయి ప‌ల్ల‌వి క‌లిసి న‌టించ‌బోతున్నారా? ఆ అవ‌కాశాలు ఉన్నట్టే క‌నిపిస్తోంది. విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా దిల్ రాజు బ్యాన‌ర్‌లో...

విశ్వసనీయత కోల్పోతున్న కేసీఆర్…?

అనేక ఆటుపోట్లను ఎదుర్కొని రెండుసార్లు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి తెలంగాణలో బీఆర్ఎస్ ను తిరుగులేని శక్తిగా నిలిపిన కేసీఆర్ ప్రస్తుతం రాజకీయాల్లో విశ్వసనీయత కోల్పోతున్నారా..?ఇందుకు కారణం ఆయన వరుసగా చేస్తోన్న వ్యాఖ్యలేనా..? అంటే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close