ఎన్నిచెప్పినా జనసేన – బీజేపీ నేతల ఆవేదనను సీరియస్‌గా తీసుకుంటారా..?

బీజేపీ హైకమాండ్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న వైసీపీ.. రాష్ట్రంలో మాత్రం.. ఆ పార్టీ నేతల్ని తరిమి తరిమికొడుతూండటం … రాష్ట్ర నాయకులను అసహనానికి గురి చేస్తోంది. స్థానిక ఎన్నికల్లో జనసేన పార్టీతో కలిసి పోటీ చేసి. ఎన్నో కొన్ని స్థానాలు గెలుచుకుని ఉనికి చాటుకుందామంటే… వైసీపీ.. దాడులతో నామినేషన్లు కూడా వేయనివ్వలేదు. మేనిఫెస్టోను ఆవిష్కరించే సమయంలో.. మేనిఫెస్టోలోని అంశాల కంటే.. తమపై జరుగుతున్న దాడుల గురించి అటు జనసేన చీఫ్.. ఇటు బీజేపీ ఏపీ చీఫ్.. మాట్లాడారు. చిత్తూరు జిల్లాలో జనసేన, బీజేపీ నేతలపై జరిగిన దాడులు దారుణమని ఇద్దరు నేతలు మండిపడ్డారు. శేషన్ లాంటి ఎన్నికల అధికారి ఉంటే .. ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం కూడా ఆలోచించాలని.. దారుణాలు నియంత్రణ చేసేలా చర్యలు తీసుకోవాలని పవన్ డిమాండ్ చేశారు. ఈ అంశాలను గవర్నర్, కేంద్రం దృష్టి కి తీసుకెళతామని.. ఇప్పటికే బీహార్ ను మించి ఎపి లో హింస అనే చర్చ నడుస్తుందన్నారు.

ఏపీ బీజేపీ చీఫ్.. కన్నా లక్ష్మినారాయణ .. వైసీపీపై మరింత తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఒక ఆర్డినెన్స్ తెచ్చి అన్ని సీట్లు తీసుకుంటే పోయేదని..ఇప్పుడు.. వైసీపీ నేతల గూండాయిజానికి.. అరాచకానికి.. జగన్ నియంతృత్వానికి ఫ్యాక్షనిజం తోడు చేసి.. రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. టెండర్ పత్రాలు లాక్కెళ్లినట్లు .. నామినేషన్ పత్రాలు చించేస్తున్నారని.. ఎన్నికల సంఘానికి చెప్పినా ప్రయోజనం లేదని విమర్శించారు. పోలీసులే విత్ డ్రా చేసుకోకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. తన రాజకీయ జీవితం లో ఈ తరహా ఎన్నికలు ఎప్పుడూ చూడలేదన్నారు. గూండాయిజానికి బ్రేక్ వేయాలంటే వైసిపిని ఓడించాలని పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డి తెచ్చిన ఆర్డినెన్స్ విషయంలో… ఆయన తన పార్టీకి కూడా కట్టుబడి ఉండాలని కన్నా డిమాండ్ చేశారు.

ఓ వైపు వైసీపీ నత్వానీని రాజ్యసభకు పంపడంలో.. బీజేపీ ఆదేశం ఉందని.. బయట ప్రచారం జరుగుతోంది. వైసీపీ, బీజేపీ మధ్య లోపాయికారీ సంబంధాలు ఉన్నాయని.. ఢిల్లీలోనూ చెప్పుకుంటున్నారు. ఇలాంటి సమయంలో.. తమ పార్టీ నేతలపై దాడులు జరుగుతున్నా… ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడలేని నిస్సహాయ స్థితికి బీజేపీ – జనసేన పార్టీలు చేరుకున్నట్లుగా కనిపిస్తోంది. ఎన్నికల తీరుపై ఆవేదన చెందడమే తప్ప.. కేంద్రంలో ఉన్న అధికార పార్టీ నేతలుగా తమ పవర్ ను చూపించలేకపోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హైద‌రాబాద్ లో భూమి కొన్న మైక్రోసాఫ్ట్…

ప్ర‌ముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ త‌న కార్య‌క‌లాపాల‌ను మ‌రింత విస్తృతం చేయ‌నుంది. ఇప్ప‌టికే హైద‌రాబాద్ స‌హా దేశంలోని ప్ర‌ముఖ న‌గ‌రాల నుండి మైక్రోసాఫ్ట్ ఆఫీసులు ప‌నిచేస్తుండ‌గా, అతిపెద్ద డేటా సెంట‌ర్ ను...

‘స్వ‌యంభూ’ యాక్ష‌న్‌: 12 రోజులు… రూ.8 కోట్లు

'కార్తికేయ 2'తో నిఖిల్ ఇమేజ్ మొత్తం మారిపోయింది. ఆ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇది వ‌ర‌కు రూ.8 కోట్లుంటే నిఖిల్ తో సినిమా చేసేయొచ్చు. ఇప్పుడు ఓ యాక్ష‌న్ సీన్...

నాని సైతం.. ప‌వ‌న్ కోసం

ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన పార్టీ స్థాపించి ప‌దేళ్ల‌య్యింది. మెగా ఫ్యామిలీ, కొంత‌మంది క‌మెడియ‌న్లు, ఒక‌రిద్ద‌రు ప‌వ‌న్ డై హార్డ్ ఫ్యాన్స్ త‌ప్ప‌, ప‌వ‌న్‌కు నేరుగా పొలిటిక‌ల్ గా స‌పోర్ట్ ఎవ‌రూ చేయ‌లేదు. దానికి...

కేసీఆర్‌కు ధరణి – జగన్‌కు టైటిలింగ్ యాక్ట్ !

తెలంగాణలో కేసీఆర్ ఎందుకు ఓడిపోయారు.. అంటే ప్రధాన కారణాల్లో ధరణి అని ఒకటి వినిపిస్తుంది. ఈ చట్టం వల్ల కేసీఆర్ , బీఆర్ఎస్ నేతలు భూములు దోచుకున్నారన్న ఓ ప్రచారం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close