స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌పై తమ్మినేని వివాదాస్పద వ్యాఖ్యలు

స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాడి.. ఓ రేంజ్‌లో ఉంది. రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్న స్పీకర్ దగ్గర్నుంచి మంత్రుల వరకూ.. అందరూ.. తమ తమ రేంజ్‌లో విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. స్పీకర్ గా ఉంటూ… నాటు భాషలో రాజకీయ విమర్శలు చేయడంలో తనదైన ప్రత్యేకత సాధించిన తమ్మినేని సీతారాం.. ఈ సారి తన భాషా ప్రావీణ్యాన్ని ఎస్ఈసీపై ప్రయోగించారు. వెధవలకు పదవులు, గాడిదలకు కొమ్ములొచ్చినా ప్రమాదమేనని ఘాటుగా స్పందించారు.ఈసీ అన్ని నిర్ణయాలు తీసుకుంటే ప్రభుత్వం ఎందుకు… రమేష్‌ కుమార్‌ను సీఎం కుర్చీలో కూర్చోమనండి అని తేల్చేశారు.

ప్రభుత్వంతో సంప్రదించకుండా నోటిఫికేషన్‌ రద్దు చేసి ఎన్నికలు నిర్వహించే అధికారం ఈసీకి లేదని తేల్చేశారు. ప్రభుత్వంపై ఎస్ఈసీ పెత్తనం ఏంటని .. రమేష్‌కుమార్‌ వంటి వ్యక్తులు కీలక స్థానాల్లో ఉంటే రాజ్యాంగానికి అవమానమని మండిపడ్డారు. రమేష్‌కుమార్‌.. రాష్ట్రం వాళ్ల అబ్బ జాగీరు అనుకుంటున్నాడా … రాష్ట్రానికి రావాల్సిన 14వ ఆర్ధిక సంఘం నిధులు ఎవరిస్తారని విరుచుకుపడ్డారు. మంత్రులు ఎక్కువగా చంద్రబాబే ఆ నిర్ణయం తీసుకున్నారన్నట్లుగా ప్రచారం చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

చంద్రబాబు ప్రలోభాలకు ఈసీ లొంగినట్టు కనిపిస్తోందని మంత్రి నాని విమర్శలు గుప్పించారు. ఓ వ్యక్తి కోసం, తన సామాజికవర్గం కోసం… ఎన్నికల కమిషనర్‌ నిర్ణయం తీసుకోవడం బాధాకరమని మంత్రి అనిల్ తేల్చేశారు. కరోనా కన్నా… చంద్రబాబు పెద్ద వైరస్‌లా తయారయ్యాడని మండిపడ్డారు. ఏపీలో పొలిటికల్ కరోనా కొనసాగుతోందని .. ఏపీలో ఆర్ధిక ఎమర్జెన్సీని ప్రతిపక్ష పార్టీలు ఆహ్వానిస్తున్నాయని మరో సీనియర్ నేత ఆనం మండిపడ్డారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీకి కరోనా చాలా విషయమే. కరోనా కన్నా.. ఎన్నికలు నిర్వహణ తమకు అత్యంత ముఖ్యమని వాదిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close