సీఎస్ టు సుప్రీంకోర్టు..! ఏపీ సర్కార్ ప్రయత్నాలు ఇన్నిన్ని కాదయా..!

స్థానిక సంస్థల ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్న షెడ్యూల్‌లోనే పూర్తి చేయాలనుకుంటున్న ఏపీ సర్కార్… దానికి అన్ని మార్కాలను వెదుక్కుంటోంది. ఒకటి తర్వాత ఒకటి…ఏ వైపు నుంచి కుదిరితే.. ఆ వైపు నుంచి ఎస్‌ఈసీ నిర్ణయం వెనక్కి తీసుకునేలా చేయడానికి సర్వశక్తులు ఒడ్డుతోంది. మొదటగా.. చీఫ్ సెక్రటరీ నీలం సాహ్నితో… ఎస్‌ఈసీ రమేష్‌కుమార్‌కు.. ప్రభుత్వం లేఖ రాయించింది. ఇది అసాధారణ ప్రయత్నం. ఎన్నికల నిలిపివేత నిర్ణయాన్ని రద్దు చేయాలని .. కరోనా నియంత్రణకు వైద్యారోగ్యశాఖ చర్యలు చేపట్టిందని వివరించారు. పోలింగ్‌ రోజు జనం గూమిగూడకుండా నియంత్రించవచ్చని .. మరో 3,4 వారాలు కరోనా అదుపులోనే ఉంటుందని సీఎస్ లేఖలో తెలిపారు.

స్థానిక ఎన్నికలు యథాతథంగా నిర్వహించాలని కోరారు. ఆ తర్వాత పార్టీకి చెందిన ఓ సానుభూతి పరుడితో..హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయించారు. అత్యవసరంగా విచారణ జరపాలని.. స్థానిక సంస్థల ఎన్నికలను కొనసాగించాలని ఆదేశించారు. ఆ వెంటనే… సుప్రీంకోర్టునూ ఆశ్రయించారు. ఇది మంగళవారం.. రెగ్యులర్ పిటిషన్లతో కలిపి విచారణ చేసే అవకాశం ఉంది. వీటితోనే రాష్ట్ర ప్రభుత్వం తన ప్రయత్నాలు ఆపలేదు. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చెప్పించడం ద్వారా… ఎస్‌ఈసీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేయాలన్న పట్టుదలతో ఆ పార్టీకి చెందిన నేతలు ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నారు.

అంతకు ముందు గవర్నర్ ను కలిసిన ఎస్‌ఈసీ రమేష్ కుమార్.. ఎన్నికల వాయిదా నిర్ణయానికి గల కారణాలు వివరించారు.ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలు నిర్వహించి తీరాలన్న పట్టుదలతో ఉండటంతో… దాని కోసం ఎలాంటి ఎక్స్‌ట్రీమ్ స్టెప్ అయినా వేసేందుకు సిద్ధపడటం.. ఈ విషయంలో.. ఏదో ఓ అనూహ్య పరిణామానికి దారి తీయడం ఖాయంగా కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

‘పారిజాత ప‌ర్వం’ రివ్యూ: సినిమా తీయ‌డం ఓ క‌ళ‌!

Parijatha Parvam movie review తెలుగు360 రేటింగ్: 1.5/5 'కిడ్నాప్ చేయ‌డం ఓ క‌ళ‌'... అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన చిత్రం 'పారిజాత ప‌ర్వం'. దాన్ని బ‌ట్టి ఇదో కిడ్నాప్ క‌థ‌ అని ముందే అర్థం చేసుకోవొచ్చు....

ఉద్యోగం ఊస్టింగ్ ? వెంకట్రామిరెడ్డి ఇక జగన్ సేవకే.. !

ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేసింది ఈసీ. ఆయన వైసీపీ కోసం ఎన్నికల ప్రచారం చేయడంతో నిర్ణయం తీసుకుంది. అంతే కాదు ఆయనను అమరావతి దాటి వెళ్లవద్దని ఉత్తర్వులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close