ఎవరికి వారే… తెలంగాణ కాంగ్రెస్ తీరే : అధిష్టానం ఆగ్రహం

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రోజురోజుకు జరుగుతున్న పరిణామాలపై పార్టీ అధిష్టానం సీరియస్ అవుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందనే సంకేతాలు అధిష్టానానికి చేరడంతో స్థానిక నాయకులపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పార్టీని పటిష్ట పరచడంపై శ్రద్ధ చూపించకపోగా ఒకరిపై ఒకరు బహిరంగంగా విమర్శలు చేసుకోవడం పార్టీకి తలనొప్పులుగా మారిందని అధిష్టానం సీనియర్ నాయకుల వద్ద అన్నట్లు సమాచారం. “పార్టీ నియమించిన రాష్ట్ర ఇన్ చార్జిపైనే బహిరంగంగా విమర్శలు చేస్తే ఇక పార్టీపై ప్రజలకు విశ్వాసం ఎలా కలుగుతుందంటూ” సీనియర్ నాయకుడు గులాం నబీ అజాద్ తెలంగాణ నాయకుల వద్ద అన్నట్లు సమాచారం. తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి ఖుంటియాను నియమించాలని అధిష్టానానికి సూచించింది తానేనని, ఆయనను బహిరంగంగా విమర్శించడమంటే తనను విమర్శించడమేనని గులాం నబీ అజాద్ తెలంగాణ నాయకుల వద్ద ప్రస్తావించినట్లు చెబుతున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఎవరి నియమించాలనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని, ఇది దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయమని గుర్తు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొత్త అధ్యక్షుడ్ని నియమించే వరకూ ప్రతి ఒక్కరూ ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడి మాటే వినాలని, ఆయన ఆదేశాలకు అనుగుణంగా పని చేయాలని కూడా చెప్పినట్లు సమాచారం. అయితే, పార్టీ సీనియర్ నాయకుడు, ఎంపీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే కార్యక్రమం చేపడితే ఇతర నాయకులు మద్దతు తెలపాల్పింది పోయి విమర్శలు చేయడం ఏమిటని కాసింత ఘాటుగానే స్పందించినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా జగ్గారెడ్డి, వీ. హనుమంతరావు వంటి సీనియర్ నాయకులు ప్రతి రోజూ రేవంత్ రెడ్డిపై చేస్తున్న విమర్శల కారణంగా కాంగ్రెస్ పార్టీ పరువు బజారున పడుతోందని వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. తెలంగాణలో పార్టీ పరిస్థితిపై పార్టీ అధినాయకులు రాహుల్ గాంధీతో సహా సోనియా గాంధీ, అహ్మద్ పటేల్ ద్రష్టికి తీసుకువెళ్తానని కూడా గులాం నబీ అజాద్ తెలంగాణ నాయకుల వద్ద అన్నట్లు సమాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈవెంట్ కంపెనీ నిర్వాకం.. నిర్మాత‌ల‌కు త‌ల‌నొప్పులు

ఇండియాలోనే నెంబ‌ర్ వ‌న్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ అని చెప్పుకొనే ఓ సంస్థ చేసిన నిర్వాకం వ‌ల్ల‌, నిర్మాత‌ల‌కు త‌ల‌నొప్పులు మొద‌ల‌య్యాయి. పోలీస్ స్టేష‌న్ మెట్లు ఎక్కాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. అస‌లు మేట‌ర్...

క్రిష్ పేరు మిస్సింగ్‌.. ఏం జ‌రిగింది?

హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు టీజ‌ర్ వ‌చ్చింది. ప‌వ‌న్ ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. ఈ సినిమాని రెండు భాగాలుగా విడుద‌ల చేస్తామ‌ని చిత్ర బృందం ప్ర‌క‌టించింది. అది కూడా ఓకే. అయితే షాకింగ్ ఏమిటంటే......

పాయకరావుపేట రివ్యూ : వంగలపూడి అనితకు కలిసొస్తున్న కాలం !

తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ లీడర్లలో ఒకరు తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత. ఈ ఐదేళ్లలో టీడీపీ మహిళా నేతలు మానసిక వేధింపులు భయంకరంగా ఎదుర్కొన్నారు. వైసీపీ నేతల బూతులు,...

చైతన్య : ప్రభుత్వం శాశ్వతం.. సీఎం కాదు – ఇంగితం లేదా నాగేశ్వర్ !

ఎంత మేధావులమని చెప్పుకున్నా తాత్కాలిక లాభాలో తాము వ్యతిరేకించే వారిని గట్టిగా వ్యతిరేకించాలన్న కురచబుద్దితో వారి ప్రత్యర్థుల్ని సపోర్టు చేసి నవ్వుల పాలవుతూంటారు. ఆ జాబితాలో చాలా కాలంగా ప్రొ.నాగేశ్వర్ కూడా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close