క్రెడిట్ వలంటీర్లకు కట్టబెట్టేస్తున్న వైసీపీ..!

ఆంధ్రప్రదేశ్‌లో కరోనాను నిర్లక్ష్యం చేశారన్న అసహనం ప్రజల్లో కనిపిస్తూండగానే… ఇప్పటికే.. కరోనాను కంట్రోల చేశామన్నట్లుగా ప్రచారం చేయాడనికి వైసీపీ.. ఆ పార్టీకి చెందిన మీడియా తాపత్రయ పడుతోంది. వలంటీర్లే.. కరోనాపై యుద్ధానికి సైనికుల్లా పని చేస్తున్నారని సెల్ఫ్ కితాబులు ఇచ్చేసుకుంటున్నారు. వారి చొరవతోనే.. ఏపీలో కరోనా కంట్రోల్ లో ఉందన్నట్లుగా మాట్లాడుతున్నారు. వైసీపీ నేతలు.. ఆ పార్టీ మీడియా ప్రచారం చూసి.. జనం ముక్కున వేలేసుకోవాల్సి వస్తోంది. ఇంతకీ వలంటీర్లు ఏం చేస్తున్నారంటే.. విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తిస్తున్నారట. దీని కోసం ఇంటిటికి సర్వే చేస్తున్నారట. నిజానికి వలంటీర్లు ఇలా ఇంటింటికి తిరగడమే ప్రమాదకరం. ఆ విషయంపై ఎన్నో విమర్శలు వస్తున్నా.. వైసీపీ దాన్ని అడ్వాంటేజ్ గా చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించడానికి వలంటీర్లు అవసరం లేదు. ఎయిర్‌పోర్టుల మంత్రిత్వ శాఖ .. ప్రయాణికుల వివరాలన్నింటినీ.. ఇస్తుంది. అది పది నిమిషాల పని. వాటి ఆధారంగా… విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించడం పెద్ద కష్టం కాదు. వలంటీర్లు ఇంటింటికి వెళ్లినప్పుడు.. ఎవరూ కూడా ఇప్పుడు తాము విదేశాల నుంచి వచ్చామని చెప్పుకోవడం లేదు. క్వారంటైన్, ఐసోలేషన్ అనే పదాలకు వారు భయపడుతున్నారు. తమకు ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేవు కాబట్టి… వారు చెప్పడం లేదు. ఈ కారణంగానే… విశాఖలో కరోనా సోకిన వ్యక్తి.. విదేశాలకు వెళ్లి వచ్చినా.. వాలంటీర్లు వివరాలు సేకరించలేకపోయారు.

వలంటీర్ల వ్యవస్థ ద్వారా రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకుంటున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న సమయంలో… ఆ వలంటీర్లకు క్రెడిట్ ఇచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు. ఇప్పుడు ఫుడ్ హోం డెలివరీ కూడా ఇంటికి తెచ్చి ఇవ్వడం లేదు. ఇంటి ఆవరణలోనే పెట్టి వెళ్తున్నారు. పది ఇళ్లు తిరిగేవారిని ఇంట్లోకి రానివ్వడమే డేంజర్ అన్న అభిప్రాయం కూడా ఉంది. కానీ ఏపీలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. వాలంటీర్లను ..గొప్ప వ్యక్తులుగా చిత్రీకరించి.. కరోనాపై పోరాటంలో వారిని యోధులుగా సర్టిఫై చేసే ప్రయత్నం చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫోటోలు – టీడీపీ మేనిఫెస్టోలో వైసీపీకి కనిపిస్తున్న లోపాలు !

వైసీపీ మేనిఫెస్టోపై ప్రజల్లో జరుగుతున్న చర్చ జీరో. ఆ పార్టీ నేతలు కూడా మాట్లాడుకోవడం లేదు. కానీ టీడీపీ మేనిపెస్టోపై టీడీపీ నేతలు ప్రత్యేకమైన ప్రణాళికలతో ప్రచార కార్యక్రమం పెట్టుకున్నారు. అదే...

టార్గెట్ పవన్ కళ్యాణ్ …పొన్నూరులో వైసీపీ అభ్యర్థి దౌర్జన్యం

ఏపీలో టీడీపీ సారధ్యంలోని కూటమిదే అధికారమని సర్వేలన్నీ స్పష్టం చేస్తుండటంతో వైసీపీ నేతల్లో ఫ్రస్టేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రబాబును అడ్డుకుంటే అది వైసీపీకి డ్యామేజ్ చేస్తుందని భావించి పవన్ ను వరుసగా టార్గెట్...

బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ … లక్ష్యం అదే..!?

బీఆర్ఎస్ దారిలోనే కాంగ్రెస్ కూడా వెళ్తున్నట్లు కనిపిస్తోంది.గతంలో ఉప ఎన్నిక జరిగే నియోజకవర్గానికి బీఆర్ఎస్ ప్రాధాన్యత ఇచ్చినట్టుగానే ప్రస్తుతం కాంగ్రెస్ కూడా అదే చేస్తుండటంతో ఆ పార్టీపై పెదవి విరుపులు మొదలయ్యాయి. ...

మోదీ రోడ్ షోలతో కూటమికి మరింత ఊపు !

ఏపీలో జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేయడానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ రానున్నారు. ఆయన టూర్ షెడ్యూల్‌ కూడా ఖరారైంది. చిలకలూరిపేటలో ఉమ్మడి ప్రచార సభ నిర్వహించిన తర్వాత ఇతర రాష్ట్రాల్లో ప్రచారానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close