మ‌హేష్‌, ఎన్టీఆర్ చిత్రాల‌పై క్లారిటీ!

ఈ యేడాది టాలీవుడ్ లో భారీ, క్రేజీ చిత్రాలు ప్రారంభం కాబోతున్నాయి. వాటిలో మ‌హేష్ – రాజ‌మౌళి, ఎన్టీఆర్ – ప్ర‌శాంత్ నీల్ చిత్రాలు ముందు వ‌రుస‌లో ఉన్నాయి. ‘గుంటూరు కారం’ పూర్త‌యిన వెంట‌నే రాజ‌మౌళి సినిమా ప‌ట్టాలెక్కుతుంద‌ని భావించారు. అయితే స్క్రిప్టు ప‌నులు, ఇత‌ర న‌టీన‌టుల ఎంపిక‌లో జాప్యం వ‌ల్ల ఆల‌స్యం అవుతోంది. ఈ సినిమా సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుంద‌న్న విష‌యంలో నిర్మాత కె.ఎల్.నారాయ‌ణ ఓ క్లారిటీ ఇచ్చేశారు. సెప్టెంబ‌రు లేదా అక్టోబ‌రులో చిత్రీక‌ర‌ణ మొద‌ల‌వుతుంద‌ని ప్ర‌క‌టించారు. ఈలోగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌న్నీ చ‌క్క‌బెడ‌తారు. ఈ సినిమా కోసమే హైద‌రాబాద్ లో కొన్ని కీల‌క‌మైన సెట్స్ తీర్చిదిద్దుతున్నారు. మ‌హేష్ కూడా పాత్ర‌కు త‌గ్గ‌ట్టుగా త‌న రూపు రేఖ‌ల్ని మార్చుకోవ‌డానికి కొంత స‌మ‌యం అడిగాడ‌ని టాక్‌. దాంతో… మ‌హేష్ సినిమా కాస్త ఆల‌స్యంగా సెట్స్‌పైకి వెళ్తోంది.

మ‌రోవైపు ఎన్టీఆర్ – ప్ర‌శాంత్ నీల్ ప‌రిస్థితి కూడా ఇంతే. ఈపాటికే ఈ కాంబోలో సినిమా ప‌ట్టాలెక్కాల్సివుంది. అయితే ‘వార్ 2’ రూపంలో ఎన్టీఆర్ కు ఓ అనూహ్య‌మైన అవ‌కాశం రావ‌డంతో త‌న డేట్ల‌న్నీ ఆ సినిమాకి కేటాయించాల్సివ‌చ్చింది. అక్టోబ‌రు నాటికి ‘వార్ 2’ షూటింగ్ పూర్త‌వుతుంద‌ని, ఆ వెంట‌నే ప్ర‌శాంత్ నీల్ సినిమా ప‌ట్టాలెక్కుతుంద‌ని తెలుస్తోంది. ఈలోగా ప్ర‌శాంత్ నీల్ ‘స‌లార్ 2’ షూటింగ్ మొద‌లెడ‌తారా, లేదా? అనేది వేచి చూడాలి. ప్ర‌శాంత్ దృష్టి ఇప్పుడు ఎన్టీఆర్ ప్రాజెక్ట్ పై ఉంద‌ని, ఆ క‌థ‌పైనే క‌స‌రత్తులు చేస్తున్నార‌న్న‌ది ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో ర‌క్త చ‌రిత్ర‌… ఇప్పుడే ఇలా ఉంటే ఫ‌లితాల రోజున ఎలా ఉంటుందో?

ఏపీ అట్టుడికిపోతోంది. ఎప్పుడు, ఎక్కడ దాడులు జరుగుతాయో తెలియని ఆందోళనకర పరిస్థితి రాష్ట్ర ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. ఫ్యాక్షన్ రాజకీయాలను సినిమాలో చూడటం తప్ప ప్రత్యక్షంగా చూడని ఈ జనరేషన్ ఏపీలో...

ఆ స‌ర్‌ప్రైజ్ ఇదేనా డార్లింగ్‌?!

సోష‌ల్ మీడియాకు పెద్ద‌గా ట‌చ్‌లో ఉండ‌ని హీరో ప్ర‌భాస్‌. ఎప్పుడో గానీ, ప్ర‌భాస్ ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టా ఖాతాలు యాక్టీవ్‌లోకి రావు. కానీ ఇప్పుడు ప్ర‌భాస్ చేసిన ఓ పోస్ట్... అభిమానుల్లో ఆస‌క్తి రేపుతోంది....

కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక… వైసీపీ ఓటమికి సంకేతమా…?

ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా రాష్ట్రంలో దాడులు జరిగే అవకాశం ఉందన్న కేంద్ర నిఘా వర్గాల తాజా హెచ్చరికలు దేనికి సంకేతం..?ఇంటలిజెన్స్ వర్గాల హెచ్చరికలు వైసీపీ ఓటమి ఖాయమని...

బటన్ నొక్కి లబ్దిదారుల నోట్లో మట్టి – డబ్బుల్లేవా ?

పోలింగ్ కు రెండు రోజుల ముందు లబ్దిదారుల ఖాతాల్లో రూ. 14వేల కోట్లు వేసేస్తామని హడావుడి చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఆ డబ్బులు జమ చేయడం లేదు. ఇదిగో అదిగో అంటూ ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close