ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ‌తో సంయుక్త‌

బెల్లంకొండ శ్రీ‌నివాస్ క‌థానాయ‌కుడిగా మూన్ షైన్ పిక్చ‌ర్స్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. దీంతో లుధీర్ బైరెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా సంయుక్త మీన‌న్ ని ఎంచుకొన్నారు. బెల్లంకొండ – సంయుక్త క‌లిసి న‌టించ‌డం ఇదే తొలిసారి. రూ.50 కోట్ల భారీ బ‌డ్జెట్ తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. బెల్లంకొండ‌కు బాగా ఇష్ట‌మైన క‌థ ఇది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో బెల్లంకొండ‌పై రూ.50 కోట్లు పెట్టుబ‌డి పెట్ట‌డం పెద్ద రిస్క్‌. కానీ క‌థ‌పై న‌మ్మ‌కంతో నిర్మాత‌లు ఈ రిస్క్ చేయ‌డానికి ముందుకొచ్చారు. యేడాది పాటు ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రిగాయి. జూన్‌లో ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభిస్తారు.

సైన్స్ ఫిక్ష‌న్, సోషియోఫాంట‌సీ క‌ల‌గ‌లిపిన థ్రిల్ల‌ర్ ఇది. ఈ జోన‌ర్‌కు ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో మంచి ఆద‌ర‌ణ ఉంది. అందుకే ఈ సినిమానీ పాన్ ఇండియా స్థాయిలోనే రూపొందిస్తున్నారు. న‌టీన‌టులు, ఇత‌ర టెక్నీష‌య‌న్ల ఎంపిక జ‌రుగుతోంది. టెక్నిక‌ల్ గా ఈ సినిమాని హై స్టాండ‌ర్డ్స్ లో తెర‌కెక్కించ‌డానికి మూన్ షైన్ పిక్చ‌ర్స్ అన్ని ఏర్పాట్లూ చేస్తోంది. ఎవ‌రూ ఊహించ‌ని కొన్ని కాంబినేష‌న్లు కూడా ఈ సినిమాతో తెర‌పై క‌నిపించే అవ‌కాశం ఉంది. త్వ‌ర‌లోనే టైటిల్ తో పాటుగా, సినిమా వివ‌రాల్ని అధికారికంగా ప్ర‌క‌టిస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎర్రబెల్లి సైలెన్స్ ఎందుకబ్బా..!!

బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కు అత్యంత సన్నితుడిగా పేరొందిన ఎర్రబెల్లి దయాకర్ ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. ఆ మధ్య ఆయన కాంగ్రెస్ లో చేరుతారని జోరుగా...

జగన్ బెంగళూర్ టూర్.. కథేంటి?

ఇప్పటికే ఇండియా కూటమికి చేరువయ్యేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ప్రచారం గుప్పుమంటోన్న నేపథ్యంలో జగన్ బెంగళూర్ పర్యటన సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఇటీవలే హడావిడిగా బెంగళూర్ నుంచి వచ్చి..ఆపై ఢిల్లీ ధర్నా అని చెప్పి...అక్కడి...

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close