“రాజదాని భూముల”పై సీబీఐ విచారణ కోరిన ఏపీ సర్కార్..!

రాజధాని భూముల విషయంలో అక్రమాలు జరిగాయంటూ.. ఆరోపణలు చేస్తున్న వైసీపీ సర్కార్.. వాటిపై విచారణ జరిపించాలంటూ.. సీబీఐకి సిఫార్సు చేసింది. ఈ మేరకు.. హోంశాఖ ముఖ్య కార్యదర్శి జీవో విడుదల చేశారు. కేబినెట్ సబ్ కమిటీ.. రాజధాని భూముల క్రయ, విక్రయాల్లో అక్రమాలు గుర్తించిందని.. దాని ప్రకారం.. కొన్ని కేసులు నమోదుచేశామని.. .ఆ జీవోలో పేర్కొన్నారు. ఆ కేసులపై విచారణ జరపాల్సిందిగా.. సీబీఐకి సిఫార్సు చేస్తూ.. హోంశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం అధికారయంత్రాంగం అంతా కరోనా నివారణ చర్యల్లో ఉంది. అయితే.. అనూహ్యంగా ఏపీ సర్కార్.. కరోనాపైనే కాదు.. ప్రతిపక్షాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నామని తాజా జీవో ద్వారా నిరూపించినట్లయింది.

రాజధాని భూముల్లో అక్రమాలంటూ వైసీపీ నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుండి విమర్శలు .. ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు అయినప్పటికీ.. ఇప్పటి వరకూ.. ఏ చర్యలూ తీసుకోలేకపోయారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ అని.. బినామీ ఆస్తులని చాలా ఆరోపణలు చేశారు కానీ… నిరూపించలేకపోయారు. కేబినెట్ సబ్ కమిటీ.. మొత్తం నాలుగు వేల ఎకరాలకుపైగా.. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని నివేదిక ఇచ్చింది. అయితే.. ఈ ఎకరాలు మొత్తం… రాజధాని పరిధిలో లేనివే. వీటిపై ప్రభుత్వం సీఐడి విచారణ జరిపించింది. ఆ తర్వాత ప్రత్యేక దర్యాప్తు బృందాలను నియమించింది. వారు.. భూముల అమ్మకం దార్లు.. కొనుగోలు దారుల వారీగా.. ఇళ్లకు వెళ్లి విచారణ జరిపారు. సోదాలు చేశారు. సిట్ ఏర్పాటు చేసిన కొద్ది రోజులుపాటు వారు సోదాలు చేశారు కానీ.. ఏమీ తేల్చలేదు.

హఠాత్తుగా ప్రభుత్వం సీబీఐ విచారణకు కేంద్రానికి సిఫార్సు చేసింది. గతంలో.. గురజాలలో అక్రమ మైనింగ్ కేసులో.. యరపతినేనిపై సీబీఐ విచారణకు సిఫార్సు చేస్తూ.. ఏపీ సర్కార్ కేంద్రానికి లేఖ రాసింది. ఆ కేసులో ఇంకా సీబీఐ విచారణ ప్రారంభం కాలేదు. తాజాగా రాజధాని భూములపైనా విచారణ కోసం సీబీఐకి సిఫార్సు చేసింది. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కోర్టు కూడా.. మూడు అంశాల్లో సీబీఐ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఆయేషా మీరా కేసు.. అక్రమ నిర్బంధం కేసులో గుంటూరులో ఓ ఎస్పీ పై విచారణ.. వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు ఆదేశిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close