ఏపీలో స్టేజ్‌ త్రీ “కరోనా కాంటాక్ట్ కేసు”లే ఎక్కువ..!

ఈ నెల పధ్నాలుగో తేదీన ఢిల్లీలో ఓ మతపరమైన కార్యక్రమం జరిగింది. దానికి తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున వెళ్లారు. వచ్చారు. అలా వచ్చిన వారంతా ఉత్తినే రాలేదు. తమతో పాటు కరోనా వైరస్‌ను తీసుకొచ్చారు. ఒకరికో.., ఇద్దరికో వస్తే.. ఎయిర్ పోర్టులోనే.. మరో చోట వచ్చందని అనుకోవచ్చు. కానీ టెస్టులు చేసినా ప్రతి ఇద్దరిలోనూ ఒకరికి వైరస్ బయటపడుతోంది. గుంటూరులో ఓ ప్రజాప్రతినిధి బంధువు ఆ మత సమ్మేళనానికి వెళ్లి .. వచ్చి పలువురుకి అంటించారు. అదే మత సమ్మేళనానికి వెళ్లిన ప్రకాశం జిల్లా వారికి కూడా వైరస్ వచ్చింది. తెలంగాణలో కరోనాతో చనిపోయిన వృద్ధుడు కూడా.. ఆ మత సమ్మేళనానికే వెళ్లారు. పాతబస్తీలో ఒకే ఇంట్లో ఆరుగురికి వైరస్ సోకింది.. వారు కూడా ఈ సమ్మేళనానికి వెళ్లినట్లుగా ప్రచారం జరుగుతోంది.

దేశంలో మార్చి ఫద్నాలుగో తేదీకి కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి ప్రారంభం కాలేదు. అప్పటికే కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారికి క్వారంటైన్ కు తరలిస్తున్నారు. అలాంటి సమయంలో.. ఢిల్లీలో జరిగిన ఈ మత సమ్మేళనంలో పాల్గొన్నవారిలో అత్యధిక మందికి వైరస్ సోకడం అధికారవర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. విదేశాల నుంచి కరోనా వైరస్‌తో వచ్చిన వారి కుటుంబసభ్యులందరికీ సోకని ఉదాహరణలు ఉన్నాయి. అత్యంత సన్నిహితంగా ఉంటే మాత్రమే.. ఈ వైరస్ కాంటాక్ట్ కేసు నమోదవుతోంది.

అలాంటిది… మత కార్యక్రమంలో పాల్గొన్న వారికి ఎలా అంటుకుందన్నది ఎవరికీ అర్థం కాని ప్రశ్నగా మారింది. ఇప్పుడు… తెలుగు రాష్ట్రాల అధికారులు ఆ మత కార్యక్రమంలో పాల్గొన్న వారందర్నీ ట్రేస్ చేసి.. క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. ఎవరికైనా అనారోగ్య లక్షణాలు ఉంటే.. ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఆ మత కార్యక్రమం మిస్టరీ ఏమిటో తేల్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

పుష్ష‌రాజ్ పాట‌: ఈసారి’డ‌బుల్’ డోస్‌

https://youtu.be/EdvydlHCViY?si=lC6JccPjEh516Zs5 సుకుమార్ - అల్లు అర్జున్‌ క‌లిస్తే ఏదో ఓ మ్యాజిక్ జ‌రిగిపోతుంటుంది. వీరిద్ద‌రికీ దేవిశ్రీ‌, చంద్రబోస్ కూడా తోడైతే - ఇక చెప్పాల్సిన ప‌నిలేదు. 'పుష్ష‌'లో అది క‌నిపించింది. 'పుష్ష 2'లోనూ ఈ...

ధర్మాన చెప్పింది అబద్దమని తేల్చిన జగన్

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో ప్రభుత్వంలో ముఖ్యమంత్రి.. రెవిన్యూ మంత్రి వేర్వేరుగా స్పందిస్తున్నారు. ఇద్దరూ ఒకటే మాట్లాడితే ఏ సమస్యా ఉండదు. కానీ ఇద్దరూ వేర్వేరుగా ప్రకటిస్తున్నారు. మంత్రి ధర్మాన చట్టం అమలు...

ఫేక్ పోస్టులు , కేసుల చుట్టూ తెలంగాణ రాజకీయం !

సోషల్ మీడియాను దుర్వినియోగం చేసి ఇష్టం వచ్చినట్లుగాఫేక్ చేసుకుంట ఒకరిపై ఒకరు బురద చల్లుకోడానికి చేస్తున్న రాజకీయం తెలంగామణలో కేసులు, అరెస్టుల వరకూ వెళ్లింది. కాంగ్రెస్ పార్టీ అమిత్ షా వీడియోను ట్విస్ట్...

సుకుమార్ కుమార్తెకు దాదా ఫాల్కే అవార్డ్

డైరెక్టర్ సుకుమార్‌ కుమార్తె సుకృతి వేణి సినీ రంగప్రవేశం చేసింది. ఆమె ప్రధాన పాత్రలో న‌టించిన చిత్రం గాంధీ తాత చెట్టు. ఈ చిత్రాన్ని గ‌తంలో ప‌లు ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో ప్రద‌ర్శించారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close