ఖైదీలకు “వైరస్” స్వేచ్చ..!

మామూలు రోజుల్లో పెరోల్ రావాలంటే… సాధారణ ఖైదీలకు సాధ్యమయ్యే పని కాదు. కిందా మీదా పడాలి.. బయట తెలిసిన వాళ్లో ..లాయర్లో అనేక ప్రయత్నాలు చేయాలి. అదీ కాకపోతే… అధికార పార్టీ నేతలకు దగ్గర వ్యక్తులయినా అయి ఉండాలి. కానీ ఇప్పుడు.. దేశవ్యాప్తంగా ఉన్న జైళ్లల మగ్గిపోతున్న వారికి… ఆత్మబంధువుగా.. కరోనా వైరస్ మారింది. ఎప్పటికైనా బయటకు వెళ్తామో.. లేదో అనుకున్న వారిని అధికారులు బలవంతంగా పెరోల్ ఇచ్చి మరీ పంపేస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ నేరాల కింద జైళ్లలో ఉన్న 12 వేల మంది ఖైదీలకు పెరోల్ ఇచ్చారు. ఇందులో తీహార్ జైలు ఖైదీలు కూడా ఉన్నారు. ముందు ముందు మరింత మంది ఖైదీల్ని విడుదల చేయబోతున్నారు.

దేశంలో ఉన్న జైళ్ల సామర్థ్యానికి..అందులో ఖైదీల్ని ఉంచే సంఖ్యకు చాలా తేడా ఉంటుంది. వంద మంది ఖైదీలు పట్టగలగే జైళ్లలో… రెండు వందల మందిని కుక్కేస్తూంటారు. దీనికి తీహార్ జైలు కూడా అతీతం కాదు. దేశంలోని అత్యంత పెద్ద జైలు కాంప్లెక్స్ అయిన తీహార్ జైలులో పది వేల మందిని ఖైదు చేసే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు అక్కడ పద్దెనిమిది వేల మందిని ఉంచారు. ఈ కారణంగా.. ఎవరికైనా వైరస్ వ్యాప్తి చెందితే..అది సులువుగా అందరికీ అంటుకుంటుందన్న ఉద్దేశంతో.. వీలైనంతగా.. జైలుపై భారం తగ్గించాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా… తక్కువ నేర తీవ్ర ఉన్న వారికి పెరోల్ ఇస్తున్నారు.

దేశ వ్యాప్తంగా ఉన్న సెంట్రల్ జైళ్లన్నింటిలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఎక్కువ మంది ఖైదీలకు 45 రోజుల పెరోల్ ఇస్తున్నారు. కొంత మందికి ఎనిమిది వారాల పెరోల్ మంజూరు చేసి బయటకు పంపుతున్నారు. అయితే.. ఇలా విడుదలయ్యే వారంతా.. స్వస్థలాలకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు. జైలు అధికారులు ఎన్వోసీ ఇచ్చినప్పటికీ.. రవాణా సౌకర్యాలు లేకపోవడంతో.. ఇబ్బంది పడుతున్నారు. కరోనా కారణంగా.. ఇప్పుడు దేశం మొత్తం స్తంభించిపోయింది. అందరూ ఇబ్బందులు పడుతున్నారు. కానీ కొంత మందికి మాత్రం.. సంతోషం కలిగిస్తోంది. అలాంటి వారిలో.. విడుదలవుతున్న ఖైదీలు ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఓటేస్తున్నారా ? : ల్యాండ్ టైటింగ్ యాక్ట్ గురించి తెలుసుకోండి !

ఆంధ్రప్రదేశ్ లో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలో ఎవరు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజల బతుకుల్ని ప్రభావితం చేస్తుంది. గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఏముందిలే...

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close