ఆ మంత్రి గారు బీఫ్ ని వదలలేకపొతున్నారు ఇంకా

హర్యానా ప్రభుత్వం రాష్ట్రంలో గోవధ, బీఫ్ (పశు మాంసం) తినడాన్ని నిషేదించింది. ఒకవేళ ఎవరయినా ఆ చట్టాన్ని ఉల్లంఘించినట్లయితే వారికి 3-10 వరకు జైలు శిక్ష విదించబడుతుంది కనుక ఆ రాష్ట్రంలో ప్రజలు బీఫ్ తినడం మానేసి ఉంటారని అనుకోవలసి ఉంటుంది. కానీ ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి అనిల్ విజ్ మాత్రం ఇంకా బీఫ్ గురించే మాట్లాడుతూ మీడియా దృష్టిని ఆకర్షిస్తున్నారు.

‘బీఫ్ తినకుండా ఉండలేనివారు మా రాష్ట్రానికి రావద్దని’ అయన సూచించారు. అందుకు ఆయన మంచి రీజనింగ్ కూడా ఇచ్చారు. “కొన్ని దేశాలలో ఆహారపు అలవాట్లు మనకి సరిపోనప్పుడు అక్కడికి వెళ్ళడానికి మనం ఏవిధంగా ఇష్టపడమో, అదేవిధంగా బీఫ్ తినకుండా ఉండలేని వారు కూడా మా రాష్ట్రం రాకుండా ఉంటేనే మంచిది,” అని సూచించారు.

బీహార్ ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రజలను రెచ్చగొట్టి తమవైపు తిప్పుకొనేందుకు ఈ ‘బీఫ్, ‘మత అసహనం’ అంశాలని హైలైట్ చేసాయి. ఆ తరువాత అవి వాటి గురించి మళ్ళీ మాట్లాడలేదు. కానీ హర్యానా ఆరోగ్య మంత్రి మాత్రం ఇంకా బీఫ్ దగ్గరే ఆగిపోయారు. హర్యానాలో వచ్చే ఏడాది వరకు ఎన్నికలు లేవు. అటువంటప్పుడు ఇటువంటి సున్నితమయిన అంశాలపై మాట్లాడటం దేనికో తెలియదు. సాధారణంగా ఇటువంటి విషయాలలోనే ఏదో ఒక సమయంలో రాజకీయ నాయకులు నోరు జారి ఇబ్బందులలో పడుతుంటారు. బహుశః ఆరోగ్య మంత్రిగారికి కూడా అటువంటి చేదు అనుభవం ఏదో ఎదురయ్యేవరకు ఇలాగ మాట్లాడుతూనే ఉంటారేమో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close