ఏపీలో వాళ్లు విధులు ఎగ్గొడితే జైలే..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్దమవుతోంది. ఆరోగ్య, ఆత్యవసరానికి సంబంధించిన ప్రభుత్వ ప్రైవేటు సర్వీసులన్నింటినీ ఎస్మా పరిధిలోకి తెస్తూ ఆదేశాలు జారీ చేసింది. 6 నెలల పాటు ఎస్మా చట్టం అమలులో ఉంటుంది. ఈ చట్టం కింద పనిచేయడానికి నిరాకరించిన వారిని.. శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉందని జీవోలో హెచ్చరించారు. ఎస్మా పరిధిలోకి వైద్య సర్వీసులు, డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది, ఆరోగ్య సేవల్లోని పారిశుద్ధ్య సిబ్బంది కూడా వస్తారు. అలాగే.. వైద్య పరికరాల కొనుగోలు, నిర్వహణ, రవాణాను కూడా.. ఎస్మా పరిధిలోకి చేర్చారు.

మందుల కొనుగోలు, రవాణా, తయారీ, అంబులెన్స్‌ సర్వీసులు.. మంచినీరు, విద్యుత్‌ సరఫరా, భద్రతా సంస్థలు, ఆహార సరఫరా… బయో మెడికల్‌ వేస్ట్‌ నిర్వహణ కూడా..ఎస్మా పరిధిలోకి వచ్చింది. పెద్ద ఎత్తున కేసులు బయటపడుతున్న సమయంలో ఎవరూ విధులకు.. డుమ్మా కొట్టకుండా ఈ జీవోను జారీ చేసినట్లుగా చెబుతున్నారు. వైద్య, ఆరోగ్యసిబ్బందికి కూడా ప్రభుత్వం సగం చొప్పునే చెల్లిస్తోంది. అదే సమయంలో ప్రైవేటు ఆస్పత్రులు కరోనా చికిత్సకు సహకరించవనే అభిప్రాయం వినిపిస్తోంది.అందుకే ముందు జాగ్రత్తగా ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగిచిందన్న భావన వ్యక్తమవుతోంది.

ఇప్పటికే..అన్ని జిల్లాల్లోని 50… అంతకన్నా ఎక్కువ పడకల సామర్థ్యం కలిగిన ప్రైవేటు ఆసుపత్రులన్నింటినీ జాతీయ విపత్తుల చట్టం కింద స్వాధీనం చేసుకుంటున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేశారు. వాటన్నింటినీ కరోనా చికిత్సకోసమే ఉపయోగించాలని నిర్ణయించారు. ఇప్పుడు సిబ్బందిపై ఎస్మా ప్రయోగించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

య‌శ్ స‌ర‌స‌న న‌య‌న‌తార‌

'కేజీఎఫ్`తో య‌శ్ పాన్ ఇండియా హీరో అయిపోయాడు. 'కేజీఎఫ్‌' త‌ర‌వాత య‌శ్ ఎలాంటి సినిమా చేయ‌బోతున్నాడా? అని దేశ‌మంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తోంది. ఈ నేప‌థ్యంలో గీతు మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌డానికి...

శింగనమల రివ్యూ : కాంగ్రెస్ రేసులో ఉన్న ఒకే ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం !

అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం అందర్నీ ఆకర్షిస్తోంది. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ రేసులో ఉందని చెప్పుకుంటున్న ఒకే ఒక్క నియోజకవర్గం శింగనమల. మాజీ మంత్రి శైలజానాథ్ గతంలో...

ఫోటోలు – టీడీపీ మేనిఫెస్టోలో వైసీపీకి కనిపిస్తున్న లోపాలు !

వైసీపీ మేనిఫెస్టోపై ప్రజల్లో జరుగుతున్న చర్చ జీరో. ఆ పార్టీ నేతలు కూడా మాట్లాడుకోవడం లేదు. కానీ టీడీపీ మేనిపెస్టోపై టీడీపీ నేతలు ప్రత్యేకమైన ప్రణాళికలతో ప్రచార కార్యక్రమం పెట్టుకున్నారు. అదే...

టార్గెట్ పవన్ కళ్యాణ్ …పొన్నూరులో వైసీపీ అభ్యర్థి దౌర్జన్యం

ఏపీలో టీడీపీ సారధ్యంలోని కూటమిదే అధికారమని సర్వేలన్నీ స్పష్టం చేస్తుండటంతో వైసీపీ నేతల్లో ఫ్రస్టేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రబాబును అడ్డుకుంటే అది వైసీపీకి డ్యామేజ్ చేస్తుందని భావించి పవన్ ను వరుసగా టార్గెట్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close