ప్రధాని తెలుగు ట్వీట్: చిరంజీవి తదితర హీరోలకు ధన్యవాదాలు

ప్రధాని నరేంద్ర మోడీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుండి తెలుగులో ట్వీట్ వెలువడింది. చిరంజీవి, నాగార్జున ,వరుణ్ తేజ్ , సాయి ధరమ్ తేజ్ తదితర హీరోలు పాట ద్వారా కరోనా విషయంలో ప్రజలను చైతన్యం చేయడానికి ప్రయత్నించిన సంగతి, ఆ పాట తెలుగు రాష్ట్రాలలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని అభినందిస్తూ ప్రధాని వీరికి ధన్యవాదాలు తెలియజేశారు.

నరేంద్ర మోడీ ట్వీట్ చేస్తూ, “చిరంజీవిగారికీ, నాగార్జునగారికీ, వరుణ్ తేజ్ కీ, సాయి ధరమ్ తేజ్ కీ మీరందరూ ఇచ్చిన అతి చక్కని సందేశానికి నా ధన్యవాదాలు.
అందరం మన ఇళ్ళల్లోనే ఉందాం.
అందరం సామాజిక దూరం పాటిద్దాం.
కరోనా వైరస్ పై విజయం సాధిద్దాం.
#IndiaFightsCorona” అని రాసుకొచ్చారు.

ఈ పాటను సంగీత దర్శకుడు కోటి రూపకల్పన చేసిన సంగతి తెలిసిందే. కోటి మాత్రమే కాకుండా మరెంతో మంది పాటల ద్వారా కరోనా వైరస్ విషయంలో తెలుగు ప్రజలను చైతన్యం చేయడానికి ప్రయత్నించారు. ముఖ్యంగా చౌరస్తా బ్యాండ్ కి చెందిన రామ్ మిరియాల పాడిన “చేతులెత్తి మొక్కుతా” అనే పాట చాలా ఊళ్ళలో పోలీసులే మైకుల ద్వారా వినిపిస్తున్నారు. అలాగే సంగీత దర్శకుడు కీరవాణి స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా లోని “ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి” పాట ట్యూన్ లో కరోనా వైరస్ మీద చైతన్యం చేస్తూ పాడిన పాట కూడా పలు ఛానల్స్ లో వినిపిస్తోంది. వీరే కాకుండా జొన్నవిత్తుల, రామ్ గోపాల్ వర్మ లాంటి వారు కూడా వారి స్టైల్ లో ఈ వైరస్ గురించి పాటలు పాడారు.

మొత్తానికి తెలుగు హీరోలను అభినందిస్తూ ప్రధాని తెలుగులో చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close