మీడియా వాచ్: ఉద్యోగాల‌కు గండం

అనుకున్న‌దంతా జ‌రుగుతోంది. లాక్ డౌన్ కొన్ని వంద‌ల, వేల ఉద్యోగాల‌న్ని బ‌లికొంటోంది. దానికి జ‌ర్న‌లిస్టులూ బ‌లి కాబోతున్నారు. లాక్ డౌన్ వ‌ల్ల ఇప్ప‌టికే కొన్ని పత్రిక‌లు ప్రింటింగ్ ఆపేశారు. ఇంకొన్ని ప‌త్రిక‌ల సైజు స‌గానికి స‌గం త‌గ్గిపోయింది. సిటీ ఎడిష‌న్లు ఆగిపోయాయి. ఒక్కో ప‌త్రిక క‌నీసం 50 నుంచి 70 శాతం న‌ష్టాల్ని భ‌రించాల్సివ‌స్తోంది. ఈ ప్ర‌భావం ఉద్యోగాల‌పై ప‌డింది. డైలీ పేప‌ర్ యాజ‌మాన్యాలు ఇప్పుడు ఓ షార్ట్ లిస్టుని త‌యారు చేస్తున్నాయి. త‌మ‌కు అక్క‌ర్లేని స‌బ్ ఎడిట‌ర్ల‌ని ఏరివేయ‌డానికి రంగం సిద్ధం చేస్తున్నాయి. ఇప్ప‌టికే ఆంధ్ర‌జ్యోతి, న‌మ‌స్తే తెలంగాణ‌, సాక్షి దిన పత్రిక‌ల యాజ‌మాన్యాలు ఓ లిస్టు త‌యారు చేసిన‌ట్టు భోగ‌ట్టా. ఆ ప్ర‌కారం మూడు నెల‌ల ముంద‌స్తు జీతాలు చెల్లించి – హూస్టింగ్ ఆర్డ‌రు చేతిలో పెట్ట‌బోతున్న‌ట్టు తెలుస్తోంది.

కొన్ని దిన ప‌త్రిక‌లు ఇప్ప‌టికే సంక్షోభంలో ఉన్నాయి. క‌రోనా వ‌ల్ల మంచో, చెడో పేప‌ర్ సైజు తగ్గింది. భ‌విష్య‌త్తులోనూ ఇదే సైజు కొన‌సాగించాల‌ని యాజ‌మాన్యాలు భావిస్తున్నాయ‌ట‌. స్పెష‌ల్ డెస్కుల్ని తొల‌గించాల‌ని, అందుకోసం పనిచేస్తున్న కొంత‌మంది పాత్రికేయుల్ని ఇంటికి పంపించేసి, జీతాల భారం త‌గ్గించుకోవాల‌ని యాజ‌మాన్యాలు భావిస్తున్నాయి. ఈనాడులో ఈ ప‌రిస్థితి కొంచెం బెట‌ర్‌. అక్క‌డ హూస్టింగులు లేవు గానీ, రిటైర్ అయి కూడా, స‌గం జీతానికి ప‌ని చేస్తున్న కొంత‌మంది ఉద్యోగులు ఇప్పుడు శాశ్వ‌తంగా ఉద్యోగాల్ని వ‌దులుకోవాల్సివ‌స్తోంది. ప్ర‌తి యేడాది ద‌స‌రాకి బోన‌స్ ఇవ్వ‌డం ఈనాడు ఆన‌వాయితీ. ఏప్రిల్ – మేల‌లో ఈఎల్స్‌కి సంబంధించిన పేమెంట్లు అందిస్తుంది. అయితే… ఈసారి ఈఎల్స్‌కి సంబంధించిన డ‌బ్బులు రాక‌పోవొచ్చ‌న్న భ‌యం ఈనాడు ఉద్యోగుల‌లో ప‌ట్టుకుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close