ప్రధాని తెలుగు ట్వీట్: చిరంజీవి తదితర హీరోలకు ధన్యవాదాలు

ప్రధాని నరేంద్ర మోడీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుండి తెలుగులో ట్వీట్ వెలువడింది. చిరంజీవి, నాగార్జున ,వరుణ్ తేజ్ , సాయి ధరమ్ తేజ్ తదితర హీరోలు పాట ద్వారా కరోనా విషయంలో ప్రజలను చైతన్యం చేయడానికి ప్రయత్నించిన సంగతి, ఆ పాట తెలుగు రాష్ట్రాలలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని అభినందిస్తూ ప్రధాని వీరికి ధన్యవాదాలు తెలియజేశారు.

నరేంద్ర మోడీ ట్వీట్ చేస్తూ, “చిరంజీవిగారికీ, నాగార్జునగారికీ, వరుణ్ తేజ్ కీ, సాయి ధరమ్ తేజ్ కీ మీరందరూ ఇచ్చిన అతి చక్కని సందేశానికి నా ధన్యవాదాలు.
అందరం మన ఇళ్ళల్లోనే ఉందాం.
అందరం సామాజిక దూరం పాటిద్దాం.
కరోనా వైరస్ పై విజయం సాధిద్దాం.
#IndiaFightsCorona” అని రాసుకొచ్చారు.

ఈ పాటను సంగీత దర్శకుడు కోటి రూపకల్పన చేసిన సంగతి తెలిసిందే. కోటి మాత్రమే కాకుండా మరెంతో మంది పాటల ద్వారా కరోనా వైరస్ విషయంలో తెలుగు ప్రజలను చైతన్యం చేయడానికి ప్రయత్నించారు. ముఖ్యంగా చౌరస్తా బ్యాండ్ కి చెందిన రామ్ మిరియాల పాడిన “చేతులెత్తి మొక్కుతా” అనే పాట చాలా ఊళ్ళలో పోలీసులే మైకుల ద్వారా వినిపిస్తున్నారు. అలాగే సంగీత దర్శకుడు కీరవాణి స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా లోని “ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి” పాట ట్యూన్ లో కరోనా వైరస్ మీద చైతన్యం చేస్తూ పాడిన పాట కూడా పలు ఛానల్స్ లో వినిపిస్తోంది. వీరే కాకుండా జొన్నవిత్తుల, రామ్ గోపాల్ వర్మ లాంటి వారు కూడా వారి స్టైల్ లో ఈ వైరస్ గురించి పాటలు పాడారు.

మొత్తానికి తెలుగు హీరోలను అభినందిస్తూ ప్రధాని తెలుగులో చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close