హాట్ స్పాట్లలోనే లాక్‌డౌన్..!

దేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని అయినా ఈ పధ్నాలుగు తర్వాత కొన్ని జాగ్రత్తలతో లాక్‌డౌన్‌ను పాక్షికంగా సడలించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయంతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఉన్నారు. ఈ మేరకు కొన్ని ప్రతిపాదలను అధికారులు సిద్ధం చేశారు. దీని ప్రకారం.. కరోనా తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న ప్రాంతాలను ఇప్పటికే హాట్ స్పాట్‌లుగా ప్రకటించారు. ఆ ప్రాంతాల్లో లాక్ డౌన్, కర్ఫ్యూ కొనసాగించాలని.. ఇతర ప్రాంతాల్లో వెసులుబాటు ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. అదీ కూడా.. పూర్తి స్థాయిలో ఎత్తివేత కాకుడా.. సూళ్లు, షాపింగ్ మాల్స్, ధియేటర్లు ప్రారంభించకుండా.. జనం గుమికూడే కార్యక్రమాలకు అనుమతి ఇవ్వకుండా.. వ్యాపార, ఉద్యోగ కార్యకలాపాలు యధావిధిగా సాగేలా చూడాలన్న ఆలోచనలో ఉన్నారు.

లాక్ డౌన్ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడే సూచనలున్నాయి. ఇది భారత్‌ను.. పదేళ్లు వెనక్కి తీసుకెళ్తుందనే ఆందోళన ఆర్థిక నిపుణుల్లో ఉంది. హాట్ స్పాట్ కాని ప్రాంతాల్లో లాక్ డౌన్ ఎత్తివేత తర్వాత అన్ని ఉత్పాదక, సేవా రంగాలు సాధారణ స్థాయిలో పని చేయాలనే ఆలోచన చేస్తున్నారు. ముఖ్యంగా రైతుల విషయాన్ని మోడీ ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు. పంట కోతల సమయంలో సాధ్యమైనంత సాయాన్ని వారికి అందించడమే కాకుండా.. వాటిని అమ్ముకునేందుకు సాయం చేయాలని నిర్ణయించారు. అలాగే వివిధ మంత్రిత్వ శాఖలు ” వ్యాపార కొనసాగింపు ప్రణాళిక”లను సిద్ధం చేయాలని మోదీ ఆదేశించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమత్రులు లాక్ డౌన్ కొనసాగింపు కోసం పట్టుబడుతున్నారు ఇప్పుడు ప్రజల్ని రోడ్లపైకి అనుమతిస్తే ఇప్పటి వరకూ పడిన శ్రమ బూడిదలో పోసిన పన్నీరవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తబ్లిగీల కేసులు ఇప్పుడే బయటపడుతున్నాయి కాబట్టి.. మరో రెండు వారాల పాటు లాక్ డౌన్ అమలు చేస్తే.. పరిస్థితి మెరుగుపడుతుందన్నఅంచనాలో ఉన్నారు. దీంతో… కేంద్రం పథ్నాలుగో తేదీ తర్వతా హాట్ స్పాట్లలోనే లాక్ డౌన్ ఉంటుందని ప్రకటించినా.. రాష్ట్రాలు మాత్రం.. ఆ వెసులుబాటు ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బడా బాయ్ కి కోపమొచ్చింది… ఛోటా బాయి కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close