ఈ ఆదివారం జాతినుద్దేశించి మోడీ ప్రసంగం..!?

ప్రధానమంత్రి నరేంద్రమోడీ మరోసారి రాత్రి ఎనిమిది గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంది. లాక్‌డౌన్ పొడిగింపుపై ఆయన నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లుగా తెలుస్తోంది. శనివారం ముఖ్యమంత్రులతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చలు జరుపుతారు. లాక్ డౌన్ అంశంపై అందరి ఆలోచనలు తెలుసుకుంటారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే.. లాక్ డౌన్ పొడిగింపు ఖాయమన్న సూచనలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చాయి. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇదే అభిప్రాయాన్ని బహిరంగంగా చెప్పారు ఒడిషా, పంజాబ్ లాంటి రాష్ట్రాలు కేంద్రంతో సంబంధం లేకుండా లాక్ డౌన్ ను పొడిగించాయి కూడా.

అయితే.. లాక్ డౌన్ పొడిగింపు ఖాయమయినప్పటికీ.. కొన్ని మినహాయింపులను ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించబోతున్నట్లుగా ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. హాట్ స్పాట్లలో లాక్ డౌన్‌కు ఎలాంటి మినహాయింపు లభించదు. ఇప్పటికే హాట్ స్పాట్లను ప్రకటించారు. వైరస్ వ్యాప్తి తక్కువగా లేదా..అసలు లేని చోట్ల మాత్రం.. మినహాయింపు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. పరిమితంగా ప్రజారవాణాను కూడా అనుమతిస్తారని అంటున్నారు. సామాజిక దూరం ఉండేలా టిక్కెట్లు బుకింగ్‌ను ఖరారు చేస్తారని అంటున్నారు మూడు సీట్లకు ఒక్క టిక్కెట్ మాత్రమే అమ్మి ప్రయాణాలు చేసేలా అనుమతించే అవకాశం ఉందంటున్నారు.

ప్రస్తుతం దేశంలో 75 జిల్లాల్లో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. వాటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కేంద్రం నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. పద్నాల్గవ తేదీకి… ప్రధానమంత్రి గతంలో ప్రకటించిన మూడు వారాల లాక్ డౌన్ గడువు పూర్తయిపోతుంది. కొత్త లాక్ డౌన్ బుధవారం నుంచి అమలులోకి వస్తోంది, ఆ లాక్ డౌన్ విధి విధానాలు ఏమిటన్నది ఆదివారం సాయంత్రం.. ప్రధానమంత్రి జాతినుద్దేశించి చేసే ప్రసంగంలో ఉండొచ్చంటున్నారు. కరోనా వైరస్ బయటపడిన తర్వాత మోడీ మూడో సారి జాతినుద్దేశించి ప్రసంగించినట్లు అవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

టీ 20 ప్ర‌పంచ‌క‌ప్: భార‌త జ‌ట్టు ఇదే

జూన్‌లో జ‌ర‌గ‌బోయే టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం భార‌త‌జ‌ట్టుని బీసీసీఐ ప్ర‌క‌టించింది. రోహిత్ శ‌ర్మ‌ని కెప్టెన్‌గా నియ‌మించింది. గాయం కార‌ణంగా జ‌ట్టుకు దూర‌మై, ప్ర‌స్తుతం ఐపీఎల్ లో బ్యాటర్‌, కీప‌ర్ గా...

గాజు గ్లాస్ గుర్తుపై ఏ క్షణమైనా ఈసీ నిర్ణయం – లేకపోతే హైకోర్టులో !

జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు రిజర్వ్ చేసినప్పటికీ ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో స్వతంత్రులకు గుర్తు కేటాయించడంపై తీవ్ర వివాదాస్పదమయింది. ఈ అంశంపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్బంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close