రమేష్‌కుమార్ లేఖపై లేఖ ద్వారా విచారణ కోరుతున్న విజయసాయి..!

ఎస్‌ఈసీగా ఉన్న సమయంలో రమేష్ కుమార్ ..కేంద్ర హోంశాఖరు రాసిన లేఖ విషయంలో విజయసాయిరెడ్డికి ఇంకా అనుమానాలు మిగిలి ఉన్నాయి. అసలు ఆ లేఖ ఎక్కడి నుంచి వెళ్లింది… ఆ లేఖపై విచారణ జరిపించాలంటూ.. డీజీపీ గౌతం సవాంగ్‌కు లేఖ రాశారు. హోంశాఖ కార్యదర్శికి రాసిన లేఖలో ఫోర్జరీ సంతకాలు ఉన్నాయని విజయసాయిరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ సందర్భంగా చేసిన సంతకానికి.. హోంశాఖకు రాసిన లేఖలో సంతకానికి మధ్య తేడా ఉందని గుర్తించినట్లుగా విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. లేఖను కనకమేడల, వర్ల రామయ్య, టీడీ జనార్ధన్‌ సృష్టించారని.. లేఖలో ఆరోపించారు.

ఈ తతంగమంతా ఎన్నికల మాజీ కమిషనర్‌ రమేష్‌ కుమార్‌కు తెలిసే జరిగిందని.. ఫోర్జరీ సంతకాలు, కల్పిత డాక్యుమెంట్లపై డీజీపీ విచారణ చేయాలని కోరారు. లేఖను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపాలి..బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని .. ఐపీ ఆధారంగా లేఖ పంపిందెవరో గుర్తించాలని లేఖలో విజయసాయిరెడ్డి డీజీపీని కోరారు. నిజానికి ఈ విషయంలో విజయసాయిరెడ్డికి ధర్డ్ పర్సన్. ఆయనకు ఎలాంటి సంబంధం లేదు. నిజంగా..సంతకం ఫోర్జరీ అయితే.. రమష్ కుమార్ ఫిర్యాదు చేయాలి. అప్పుడే ఆ ఫిర్యాదు వ్యాలిడ్ అవుతుంది. కానీ విజయసాయిరెడ్డి మాత్రం.. తనకే మాత్రం సంబంధం లేకపోయినా… ముగ్గురు టీడీపీ నేతల్ని కలిపేసి.. రమేష్ కుమార్‌కు తెలిసే జరిగిందని ఆరోపిస్తూ.. విచారణ చేయాలని లేఖ రాశారు.

రమేష్ కుమార్ కి తెలిసే ఆ లేఖ రాస్తే.. ఇక సమస్యే లేదు. తమపై లేదా.. ప్రభుత్వంపై కుట్ర పన్నారని భావిస్తే.. ఆ మేరకు.. ఫిర్యాదు చేయాలి. కానీ విజయసాయిరెడ్డి డీజీపీకి లేఖ రాసి.. దాన్ని మీడియాకు విడుదల చేశారు. ఎస్‌ఈసీ లేఖ మీడియాకు విడుదలైనప్పటి నుంచి అది ఫేక్ అని చెప్పేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించారు. లేఖ అందిందని.. రక్షణ కల్పించామని.. హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి చెప్పిన తర్వాత అది ఎలా బయటకు వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు.. రమేష్ కుమార్ కు తెలిసే టీడీపీ నేతలు ఆ లేఖ రాశారంటూ.. కొత్త వాదన వినిపిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close