మద్యం షాపుల ముందు 5 కాదు.. 500 మంది..!

ఆంద్రప్రదేశ్‌లో 40 రోజుల తర్వాత మద్యం దుకాణాలను ప్రభుత్వం ప్రారంభించాలని నిర్ణయించడంతో… ఆ రాష్ట్రానికి మొత్తానికి ఎప్పుడూ లేనంత కళ వచ్చేసింది. ఉదయం నుంచే ప్రజలు రోడ్ల మీదకు వచ్చారు. సాధారణంగానిత్యావసర వస్తువులకు మాత్రమే ఇటీవలి కాలంలో బయటకు వస్తున్నారు. ఇప్పుడు మద్యం అంత కంటే ముఖ్యమైనదిగా భావిస్తున్నారేమో కానీ.. ప్రతీ ఒక్క షాపు ముందు .. తెరవక ముందే కిలోమీటర్ల మేర క్యూ ఏర్పడిపోయింది. ఉదయం పదకొండు గంటలకు అధికారికంగా మద్యం దుకాణాలు తెరుస్తారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి క్యూ ప్రారంభమయింది. చాలా చోట్ల అది మూడు, నాలుగు కిలోమీటర్లు కూడా ఉంది. కొన్ని చోట్ల మాత్రమే.. భౌతిక దూరం నిబంధనలు పాటించారు. ఇంకెక్కడా వాటి గురించి పట్టించుకోలేదు.

కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం.. దుకాణం వల్ల.. ఐదుగురు అంటే.. ఐదుగురు మాత్రమే ఉండాలి. ఎక్కవ మంది ఉంటే.. దుకాణాలు మూసివేయాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా.. అవే మార్గదర్శకాలు విడుదల చేసింది. దీని ప్రకారం..భౌతిక దూరం పాటించి..ఐదుగురు మాత్రమే ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసులపై పడింది. కానీ పోలీసులు వచ్చిన వారందర్నీ.. క్యూలో నిలబెట్టడానికే తంటాలు పడ్డారు. ఎవరనీ.. షాపు వద్ద నుంచి వెళ్లిపోవాలని కోరలేదు. చాలా చోట్ల సోషల్ డిస్టెన్స్ కూడాపాటించలేదు. మెజార్టీ మందుబాబులకు మాస్కులు కూడా లేవు. మద్యం కొనుగోలుదారులకు ప్రత్యేకంగా పర్మిషన్ ఉన్నట్లుగా పోలీసులు వారందర్నీ చూసీ చూడనట్లుగా వ్యవహరించారు.

ప్రభుత్వం తీరుపై.. విపక్ష పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రజలకు కావాల్సింది మద్యం కాదని… కరోనా వ్యాప్తి చెందితే.. ఎవరిది బాధ్యత అని ప్రశ్నిస్తున్నాయి. అయితే కేంద్ర మార్గదర్శకాల ప్రకారమే.. తాము మద్యం దుకాణాలు ప్రారంభించామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం దుకాణాల్లో ఉన్న సరుకు.. నలభై రోజుల నుంచి మందుబాబులు కరువుతో ఉండటంతో.. త్వరగా అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే.. రెండు రోజుల ముందే.. ఏపీ డిస్టిలరీల్లో ఉత్పత్తికి సర్కార్ అనుమతి ఇచ్చింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో హాట్ టాపిక్ ” జగన్ ప్యాలెస్ “

పేదల సీఎం గా తనను తాను చెప్పుకునే జగన్ రెడ్డి పెద్ల దగ్గర వసూలు చేసిన పన్నులతో కట్టిన ప్యాలెస్ చూసి రాష్ట్ర ప్రజల మైండ్ బ్లాంక్ అవుతోంది. వందల కోట్లు ఖర్చు...

పబ్లిక్‌కి రుషికొండ ప్యాలెస్ గేట్లు ఓపెన్

రుషికొండ వైపు అడుగు పెడితే అరెస్టు చేసేవారు ఎన్నికలకు ముందు.. ఇప్పుడు .. రుషికొండ ప్యాలెస్ గేట్లు ప్రజలు చూసేందుకు ఓపెన్ చేశారు. గంటా శ్రీనివాసరావు స్థానిక నేతలు, మీడియా ప్రతినిధులతో వెళ్లి...

ఈవీఎంలు అయితే ఇక వైసీపీ ఎన్నికల బహిష్కరణే !

ఈవీఎంలను శకుని పాచికలు అని.. ఎటు కావాలంటే అటు పడుతున్నాయని జగన్ రెడ్డి కొత్త మాట చెబుతున్నారు. ఆయన పార్టీ నేతలు కూడా అదే చెబుతున్నారు. ఇదే జగన్ 2019 ఎన్నికల...

“రీ డిజైన్” క్రెడిట్ కేసీఆర్‌దే !

ప్రాజెక్టులను రీడిజైన్ చేసింది కేసీఆర్. ఈ మాట ఆయన చెప్పుకున్నారు. బీఆర్ఎస్ నేతలు చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు మాత్రం ఆయనకు సంబంధం లేదంటున్నారు. ఎందుకంటే... విచారణ నుంచి తప్పించుకోవడానికి. కేసీఆర్ ది కాకపోతే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close